Political News

వైసీపీకి మ‌రో నేత గుడ్ బై.. త్వ‌ర‌లోనే టీడీపీలోకి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై చెప్ప‌నున్నారు. పైగా ఈయ‌న ఎస్సీ నాయ‌కుడు కావడం గ‌మ‌నార్హం. ఆయ‌నే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే, ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం. తాజాగా ఈయ‌న హైదరాబాద్‌లో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. పార్టీలో చేరిక‌పై ఆయ‌న చ‌ర్చించారు. ఆదిమూలం వెంట ఆయ‌న కుమారుడు కూడా ఉన్నారు. టీడీపీలో చేరే అంశంపై లోకేశ్ తో ఆయన చర్చించారు.

ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుతో ఫోన్‌లో సంప్ర‌దించిన ఆదిమూలం ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే నారా లోకేష్‌తో భేటీ అయిన‌ట్టు తెలిసింది. సీఎం జగన్ నియోజకవర్గాల మార్పు చేపడుతుండడం చాలా మంది సిట్టింగ్ లకు నచ్చడం లేదు. దాంతో అసంతృప్తికి గురైన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయ‌న‌ను ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం తిరుపతి ఎంపీ టికెట్ ప్ర‌తిపాదించింది.

గెలిపించుకునే బాధ్య‌త‌ను తాముతీసుకుంటామ‌ని.. పోటీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పుకొచ్చా రు. అయితే.. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం.. డైల‌మాలో ప‌డ్డారు. పైగా.. స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార‌ణంగానే త‌న‌కు సీటు రాలేద‌ని ఆయ‌న ఇటీవ‌ల బ‌హిరంగ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా రువ్వారు. పెద్ది రెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

టీడీపీలో చేరేందుకు రెడీ అయిన‌ ఆదిమూలంకు వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీగా నే ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీనాయ‌కులు పెట్టుకున్న ఆశ‌లు.. వారి హ‌వా నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం .. గ‌గ‌న‌మేన‌ని అంటున్నారు. అయితే.. టికెట్ ఇస్తార‌న్న ఆశ‌ల‌తోనే ఆదిమూలం ఇటువైపు అడుగులు వేశారు. మ‌రి చివ‌ర‌కు చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

This post was last modified on January 30, 2024 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

7 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

5 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago