ఏపీ అధికార పార్టీ వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారు. పైగా ఈయన ఎస్సీ నాయకుడు కావడం గమనార్హం. ఆయనే ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే, ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం. తాజాగా ఈయన హైదరాబాద్లో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. పార్టీలో చేరికపై ఆయన చర్చించారు. ఆదిమూలం వెంట ఆయన కుమారుడు కూడా ఉన్నారు. టీడీపీలో చేరే అంశంపై లోకేశ్ తో ఆయన చర్చించారు.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో సంప్రదించిన ఆదిమూలం ఆయన సూచనల మేరకే నారా లోకేష్తో భేటీ అయినట్టు తెలిసింది. సీఎం జగన్ నియోజకవర్గాల మార్పు చేపడుతుండడం చాలా మంది సిట్టింగ్ లకు నచ్చడం లేదు. దాంతో అసంతృప్తికి గురైన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయనను ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం తిరుపతి ఎంపీ టికెట్ ప్రతిపాదించింది.
గెలిపించుకునే బాధ్యతను తాముతీసుకుంటామని.. పోటీ చేయాలని సీఎం జగన్ స్వయంగా చెప్పుకొచ్చా రు. అయితే.. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం.. డైలమాలో పడ్డారు. పైగా.. స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే తనకు సీటు రాలేదని ఆయన ఇటీవల బహిరంగ విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. వ్యక్తిగత విమర్శలు కూడా రువ్వారు. పెద్ది రెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
టీడీపీలో చేరేందుకు రెడీ అయిన ఆదిమూలంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీగా నే ఉంది. నియోజకవర్గంలో టీడీపీనాయకులు పెట్టుకున్న ఆశలు.. వారి హవా నేపథ్యంలో చంద్రబాబు ఈయనకు టికెట్ ఇవ్వడం .. గగనమేనని అంటున్నారు. అయితే.. టికెట్ ఇస్తారన్న ఆశలతోనే ఆదిమూలం ఇటువైపు అడుగులు వేశారు. మరి చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on January 30, 2024 10:26 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…