సారి సంచలన మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే.. కీలకమైన ఇద్దరు నాయకులు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని మాస్ టాక్. వీరు ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో అడుగు పెడతారని అంటున్నారు. వారే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. “వారిద్దరూ ఈ సారి పక్కాగా సభలో అడుగు పెడతారు. వారిద్దరు ఉంటే.. సభ ఎలా ఉంటుందో“ అని పొలిటికల్ సర్కిళ్ల మధ్య కూడా చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీగెలుస్తుంది? ఏ పార్టీ ఓడుతుంది? అనే విషయాన్ని పక్కన పెడితే.. కీలకమైన నాయకుల గురించి మాత్రం తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. వైసీపీ సర్కారు సహా సీఎం జగన్ను టార్గెట్ చేసుకుని.. పవన్ కళ్యాణ్ ఆది నుంచి దూకుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటి చేసినా.. పరాజయం పాలయ్యారు. కానీ, రాష్ట్రం కోసం.. రాష్ట్ర సమస్యల కోసం ఆయన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటిబలమైన నాయకుడు సభలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఈ దఫా గెలిచి తీరుతారని పార్టీలకు అతీతంగా అభిమానులు చెబుతున్నారు. పవన్ వాయిస్ సభలో అయితే.. ఇంకా బాగుటుందని అనే వారు పెరుగుతున్నారు. దీంతో పవన్ గెలుపు తథ్యమనే టాక్ వినిపిస్తోంది. ఇక, వైఎస్ తనయగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల కూడా.. బలమైన గళం వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ లోపాలు.. ప్రజా సమస్యలను ఆమె ప్రస్తావిస్తున్నారు. ఇవి పార్టీకి ఎంత వరకు కలిసి వస్తాయో తెలియదు. కానీ, ఆమెకు ప్లస్ అవుతాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కనుక ఆమె పోటీ చేస్తే.. గెలిచే చాన్స్ నూటికి 100 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆమె గళం అసెంబ్లీకి చేరితే.. ప్రజాసమస్యలపై మరింత ప్రస్తావన పెరుగుతుందని మేధావులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటివారిని అసెంబ్లీకి పంపిస్తే.. బాగుంటుందని అంటున్నారు. ఇక, ఇప్పటికే చంద్రబాబు గెలుపును రాసిపెట్టుకున్న దరిమిలా.. ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలోనూ పాజిటివ్ ఆలోచనలు రావడం గమనార్హం. ఇదే జరిగితే.. రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనని అంటున్నారు.
This post was last modified on January 30, 2024 6:34 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…