మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని ఆయన చెప్పారు. అయితే.. అది వైసీపీ తరఫునా, లేదా? అనేది త్వరలోనే చెబుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం తప్పదని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఈయనను హోల్డ్లో పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్ వాటికి అభ్యర్థులను ఖరారు చేసింది.
కానీ, కీలకమైన మైలవరం సీటు విషయంలో మాత్రం వైసీపీ తర్జన భర్జన పడుతోంది. ఈ సీటు విషయంపై తేల్చాలని ఎమ్మెల్యే వసంత కోరుతున్నా.. దీనిపై క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు.. తనను తప్పిస్తారని.. వేరే వారికి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించి వసంత కృష్ణ ప్రసాద్.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని అన్నారు. అయితే.. అది వైసీపీనా, కాదా? అనేది త్వరలోనే చెబుతానని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని వసంత చెప్పారు. దాదాపు వంద శాతం మందికి ఈ సంక్షేమం అందుతోందని.. ఒకరిద్దరికి అందకపోయినా.. అది టెక్నికల్ సమస్యేనని చెప్పారు. అయినప్ప టికీ.. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జీ.కొండూరు మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు.
This post was last modified on January 29, 2024 6:09 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…