మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని ఆయన చెప్పారు. అయితే.. అది వైసీపీ తరఫునా, లేదా? అనేది త్వరలోనే చెబుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం తప్పదని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ఈయనను హోల్డ్లో పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్ వాటికి అభ్యర్థులను ఖరారు చేసింది.
కానీ, కీలకమైన మైలవరం సీటు విషయంలో మాత్రం వైసీపీ తర్జన భర్జన పడుతోంది. ఈ సీటు విషయంపై తేల్చాలని ఎమ్మెల్యే వసంత కోరుతున్నా.. దీనిపై క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు.. తనను తప్పిస్తారని.. వేరే వారికి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించి వసంత కృష్ణ ప్రసాద్.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీరతానని అన్నారు. అయితే.. అది వైసీపీనా, కాదా? అనేది త్వరలోనే చెబుతానని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోందని వసంత చెప్పారు. దాదాపు వంద శాతం మందికి ఈ సంక్షేమం అందుతోందని.. ఒకరిద్దరికి అందకపోయినా.. అది టెక్నికల్ సమస్యేనని చెప్పారు. అయినప్ప టికీ.. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జీ.కొండూరు మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు.
This post was last modified on January 29, 2024 6:09 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…