సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్ తో పాటు తనకు కూడా సమానంగా భాగస్వామ్యం ఉందని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్ కు, తనకు సమాన వాటా ఉండాలని అనుకున్నారని చెప్పారు.
ఇక వైఎస్ఆర్ కుటుంబం సొంత ఇలాక కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని విమర్శించారు. రక్తం పంచుకు పుట్టిన తనపై రోజుకో దొంగతో జగన్ తిట్టిస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నీచ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా భయపడబోనని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కడప తనకు పుట్టినిల్లు అని, జగన్ లా తాను కూడా జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ శ్రేణులకు గుర్తు లేవని షర్మిల విమర్శించారు. తనపై బురదజల్లేందుకు రోజుకో జోకర్ ను తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలా రెడ్డి అన్నదే తన ఉనికి అని చెప్పారు. విలువలు విశ్వసనీయతలు మీకు లేవా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.
This post was last modified on January 29, 2024 5:29 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…