Political News

సాక్షిలో నాకూ వాటా ఉంది: షర్మిల

సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్ తో పాటు తనకు కూడా సమానంగా భాగస్వామ్యం ఉందని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్ కు, తనకు సమాన వాటా ఉండాలని అనుకున్నారని చెప్పారు.

ఇక వైఎస్ఆర్ కుటుంబం సొంత ఇలాక కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్న అని, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని విమర్శించారు. రక్తం పంచుకు పుట్టిన తనపై రోజుకో దొంగతో జగన్ తిట్టిస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నీచ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా భయపడబోనని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

కడప తనకు పుట్టినిల్లు అని, జగన్ లా తాను కూడా జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. జగన్ కు, పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ శ్రేణులకు గుర్తు లేవని షర్మిల విమర్శించారు. తనపై బురదజల్లేందుకు రోజుకో జోకర్ ను తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలా రెడ్డి అన్నదే తన ఉనికి అని చెప్పారు. విలువలు విశ్వసనీయతలు మీకు లేవా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.

This post was last modified on January 29, 2024 5:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago