Political News

ముహూర్తం ఫిక్స్‌.. రంగంలోకి ప‌వ‌న్‌…!

ముహూర్తం ఫిక్స్ అయింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో టీడీపీ తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనాని.. ఆ మేర‌కు ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పైనా ఒక లెక్క‌కు వ‌చ్చారు. ఇక‌, సంఖ్య‌, వాసి, రాసి.. అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తంగా క‌లిసి పోటీ చేయ‌డం, వైసీపీని గ‌ద్దె దింప‌డం, రాష్ట్రాన్ని బాగు చేసుకోవ‌డం అనే కాన్సెప్టుతో ముందుకు సాగుతు న్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టీడీపీతో పొత్తు ఖ‌రారైంది.

అయితే.. బీజేపీ క‌లిసి వ‌స్తుందేమోన‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న ఉన్నారు. ఈ విష‌యం ఇప్పటి వ‌ర‌కు తేల‌లే దు. ఇక‌పైనా తేలుతుందా? లేదా? అనేది ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార శంఖం పూరించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డంతోపాటు.. కీల‌క‌మైన కొన్ని జిల్లాల‌ను టార్గెట్ చేసుకుని అక్క‌డ ప్ర‌చారం చేయ‌నున్నారు.

వారాహి యాత్ర‌తో పాటు.. కుదిరితే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో(కాకినాడ సిటీ వంటి క‌ఠిన‌మైన టార్గెట్‌గా భావిస్తున్న‌) పాద‌యాత్ర చేసే అవ‌కాశం ఉంది. ఈ దిశ‌గానే పార్టీ వ్యూహం రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అయిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలుత అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న యాత్ర ప్రారంభించ‌నున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ప‌వ‌న్ పోటీ చేసేఅ వ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక్క‌డ మొద‌లు పెట్టి ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, అనంత‌పురం, క‌ర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ప్రాధ‌మికంగా ప‌వ‌న్ యాత్ర‌కు రూట్ మ్యాప్ సిద్ధ‌మైంది. అయితే.. అవ‌స‌రం బ‌ట్టి ఈ మ్యాప్ మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ.. ప‌వ‌న్ ఒక్క‌రే చేయ‌నున్న ప్ర‌చారాలు. ఇక‌, పార్టీ నాయకుల‌తో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు కూడా ఉండ‌నున్నాయ‌ని అంటున్నారు. అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం చేసేందుకు.. మ‌రో టీంను రెడీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలో వారికి శిక్ష‌ణ, అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది.

This post was last modified on January 29, 2024 5:09 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago