టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా! పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ .. తాజాగా రాజమండ్రిలో జరిగింది. గత వారం నుంచి ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో రా..కదలిరా! బహిరంగ సభలు నిర్వహి స్తున్నారు. తాజాగా.. రాజమండ్రిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తమ పొత్తును విచ్చిన్నం చేయాల ని చూస్తున్నారని, కానీ.. వారి పప్పులు తన దగ్గర ఉడకవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలిచి తీరుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పొత్తు పెట్టుకున్నది.. తమ రెండు పార్టీల కోసం కాదని.. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసమని చంద్రబాబు చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో పొత్తును ఆశీర్వదించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపు ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఇదే స్ఫూర్తిని ఎన్నికల సమయంలోనూ చూపించాలని బాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. “రా కదలిరా పిలుపు టీడీపీ, జనసేన కోసం కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. భవిష్యత్తు ను కాపాడుకోవడం కోసమే” అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మానసిక రోగి పరిపాలన సాగిస్తున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆయన నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందన్నారు. అందుకే.. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకున్నామన్నారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఈ ఐడేళ్లలో రాలేదని.. తాను అధికారంలోకి వచ్చాక.. పెట్టుబడులు ఎలా పరుగులు పెడతాయో చూడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “అప్పుడు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నాడు. వీటిని నమ్మితే తమ్ముళ్లూ.. మరోసారి రాష్ట్రం నాశనం కావాల్సిందే” అని సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు.కానీ, తూర్పులో నిర్వహించిన ఈ సమావేశానికి భారీ ఎత్తున ప్రజలు, పార్టీ అభిమానులు తరలి వచ్చారు.
This post was last modified on January 29, 2024 6:52 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…