టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా! పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ .. తాజాగా రాజమండ్రిలో జరిగింది. గత వారం నుంచి ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో రా..కదలిరా! బహిరంగ సభలు నిర్వహి స్తున్నారు. తాజాగా.. రాజమండ్రిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తమ పొత్తును విచ్చిన్నం చేయాల ని చూస్తున్నారని, కానీ.. వారి పప్పులు తన దగ్గర ఉడకవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలిచి తీరుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పొత్తు పెట్టుకున్నది.. తమ రెండు పార్టీల కోసం కాదని.. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసమని చంద్రబాబు చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో పొత్తును ఆశీర్వదించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి ‘రా కదిలి రా’ అని పిలుపు ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఇదే స్ఫూర్తిని ఎన్నికల సమయంలోనూ చూపించాలని బాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. “రా కదలిరా పిలుపు టీడీపీ, జనసేన కోసం కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. భవిష్యత్తు ను కాపాడుకోవడం కోసమే” అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మానసిక రోగి పరిపాలన సాగిస్తున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆయన నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందన్నారు. అందుకే.. జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకున్నామన్నారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఈ ఐడేళ్లలో రాలేదని.. తాను అధికారంలోకి వచ్చాక.. పెట్టుబడులు ఎలా పరుగులు పెడతాయో చూడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “అప్పుడు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నాడు. వీటిని నమ్మితే తమ్ముళ్లూ.. మరోసారి రాష్ట్రం నాశనం కావాల్సిందే” అని సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు.కానీ, తూర్పులో నిర్వహించిన ఈ సమావేశానికి భారీ ఎత్తున ప్రజలు, పార్టీ అభిమానులు తరలి వచ్చారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…