గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ నేతలు, నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవడం లేదంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది రోజులు క్రితం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతున్నాయని, కానీ, సంబంధిత శాఖా మంత్రి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలోనే షర్మిలపై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు.
పాపం…షర్మిల పిచ్చి పిల్ల…ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటూ అంబటి చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. అంతకన్నా తానేం చెప్పలేననని, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందని అన్నారు. అయితే, రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందని, ఆమెను ఓవర్ యాక్షన్ చేసుకోనివ్వాలని చెప్పారు అంబటి. మరి, అంబటి వ్యాఖ్యలపై షర్మిల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 29, 2024 2:11 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…