తెలంగాణా రాజకీయాల్లో రోజుకో డెవలప్మెంట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈమధ్యనే ప్రకాష్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళిన మంత్రి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగిందన్నది ఇప్పటికీ సస్పెన్సుగా ఉండిపోయింది. ఇవ్వాళా రేపు అధికార, ప్రతిపక్షాల నేతలు కలిస్తే పార్టీ మారటమే ఉద్దేశ్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరిగిపోతోంది. ఇందులో చాలావరకు వాస్తవం కూడా ఉంటుంది.
అయితే ప్రకాష్ తో మంత్రి భేటీఅయిన మూడు రోజుల తర్వాత నలుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఏకంగా రేవంత్ తోనే భేటీ అయ్యారు. ఈ విషయం పార్టీలో సంచలనంగా మారింది. సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మాణిక్ రావు సీఎంతో భేటీ అయ్యారు. ఎవరు సీఎంతో భేటీ అయినా నియోజకవర్గ అభివృద్ధికోసమనే చెప్పటం మామూలే. కాబట్టి మరుసటి రోజు మీడియా సమావేశంలో సునీతా లక్ష్మారెడ్డి కూడా అలాగే చెప్పారు.
ఎంఎల్ఏ మాటలను నమ్మే వాళ్ళు నమ్మారు లేనివాళ్ళు లేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ను కలిసిన నలుగురు ఎంఎల్ఏలందరు మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళే. ఆరోజు నలుగురు ఎంఎల్ఏలు కలిస్తే ఆదివారం ప్రకాష్ గౌడ్ కలిశారు. ముందు ముందు ఇంకెంతమంది ఎంఎల్ఏలు కలుస్తారో చెప్పలేం. అసలు విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుమాసాల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పదేపదే ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు రేవంత్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు కూడా పెడుతున్నారు.
ఇదే సమయంలో మాజీమంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా గోలచేస్తున్నారు. దీనికి కౌంటరుగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చాలామంది తమతో టచ్ లో ఉన్నారంటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళే ఎంఎల్ఏలు ఎవరు కనబడటంలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఎంఎల్ఏలు చాలామందే ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇపుడు జరుగుతున్నదంతా ఇందులో భాగమేనా ?
This post was last modified on January 29, 2024 11:57 am
నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక, ఆయన చేసిన చిత్రాల్లో అభిమానులను అత్యంత అలరించింది ఓజీనే. సినిమా…
ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…
ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…
ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…
శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…