దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు.
ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. పాలనా సంస్కరణల మీద మరింత జోరు పెంచారు కేసీఆర్.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే..ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమంటున్నారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతి సింహ భాగం రెవెన్యూ విభాగంలోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాను ఏం చెబుతున్నానో.. అవన్నీ పచ్చి వాస్తవాలన్న మాట చెప్పేందుకు వీలుగా.. ఇటీవల కాలంలో పట్టుబడిన రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారుల ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తనదైన రీతిలో సరిదిద్దుతున్నారు కేసీఆర్. ఇప్పటికున్న వివిధ స్థాయిల్ని మార్చటంతో పాటు.. పలువురు అధికారుల అధికారాలకు కత్తెర వేయటం.. రద్దు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఏమన్న విషయంలోకి వెళితే.. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూస్తే..
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…