దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు.
ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. పాలనా సంస్కరణల మీద మరింత జోరు పెంచారు కేసీఆర్.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే..ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమంటున్నారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతి సింహ భాగం రెవెన్యూ విభాగంలోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాను ఏం చెబుతున్నానో.. అవన్నీ పచ్చి వాస్తవాలన్న మాట చెప్పేందుకు వీలుగా.. ఇటీవల కాలంలో పట్టుబడిన రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారుల ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తనదైన రీతిలో సరిదిద్దుతున్నారు కేసీఆర్. ఇప్పటికున్న వివిధ స్థాయిల్ని మార్చటంతో పాటు.. పలువురు అధికారుల అధికారాలకు కత్తెర వేయటం.. రద్దు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఏమన్న విషయంలోకి వెళితే.. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూస్తే..
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…