త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార వైసీపీ .. సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు కూడా.. చాలా మందిని మార్చేసింది. వారు ప్రతినిధ్య వహిస్తున్న నియోజకవర్గాలు కాకుండా.. వేరే వేరే నియోజకవర్గాలకు పంపించేసింది. వీరిలో మంత్రులు కూడా విరివిగానే ఉన్నారు. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అయితే.. వీరంతా కూడా.. కొత్త నియోజకవర్గాల్లో ఏమేరకు సక్సెస్ అవుతామనే బెంగతో ఉన్నారు.
అంతేకాదు.. ఎన్నికలకు రెండు మాసాలు కూడా గడువు లేదని.. ఈ షార్ట్ టైంలో ఎంత వరకు ప్రజలను కలుస్తామని వారు భావిస్తున్నారు. అదేసమయంలో ఇప్పటి వరకు ఒక నేతకు అలవాటు పడిన కేడర్.. ఇప్పుడు అనూహ్యంగా తమ వెనుక నడవాలంటే కూడా.. కష్టమని మరికొందరు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గం మార్పును తట్టుకోలేక.. ఎంపీ బాలశౌరి వంటివారు పార్టీకి రాజీనామా చేశారు. ఇక, మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా.. అదే విధంగా ఉన్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలు కూడా.. అధిష్టానానికి రిక్వెస్టులు పంపిస్తున్నారు. తమకు తమ నియోజకవర్గాలే ఇవ్వాలని కోరుతున్నారు. వీరి అభ్యర్థనలతో అధిష్టానం కూడా.. ఇరుకున పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సిద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పరోక్షంగా ఈ సమస్యను ప్రస్తావించారు. నియోజకవర్గాలు మార్చిన అభ్యర్థులకు అభయం ప్రసాదించారు. నేనున్నానంటూ.. ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఎక్కడా ఎవరి పేరూ జగన్ చెప్పలేదు.
“ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినా.. అవి వారి సొంత నియోజకవర్గాలు కావని అనుకుంటున్నా.. ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎవరు ఎక్కడ నుంచి బరిలో ఉన్నా.. మనం, మన ప్రభుత్వం అమలు చేసిన పథకా లు అందరినీ గెలిపిస్తాయి. దీనికి నాదీ హామీ!” అని జగన్ వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా నియోజకవర్గాలు మార్చిన సమన్వయ కర్తలను ఉద్దేశించే జగన్ చెప్పారని పార్టీ సీనియర్లు అంటున్నారు. సో.. వీరంతా గెలుస్తారని.. ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా జగన్ హామీ ఇచ్చారని వివరిస్తున్నారు. ఇదీ.. సంగతి.
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…