వైసీపీ అధినేత జగన్ వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతివ్యూహం రెడీ చేశారా? అదిరిపోయే స్కెచ్తో ఆయన ముందుకు రానున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికలను పూర్తిగా బీసీ మంత్రంతో జరిపించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు 52 శాతం ఉండడం, వారిలోనూ మహిళా పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న దరిమిలా.. మెజారిటీ స్థానలను బీసీలకే కేటాయించాలని జగన్ నిర్నయించారు.
ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం ఎంపీ టికెట్(ప్రస్తుత ఎంపీ బీసీనే) నుంచి నరసరావుపేట ఎంపీ టికెట్ వరకు.. అదేవిధంగా మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను కూడా.. బీసీ అభ్యర్థులకే కేటాయించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను కూడా నియమించారు. తద్వారా.. బీసీ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు జగన్ వ్యూహత్మంగా ముందుకు సాగుతున్నారు. ఇది టీడీపీ ఓటు బ్యాంకును కూడా కదలించే పరిస్థితి ఉంటుందని అంచనా వచ్చింది.
దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు.. ఈ పరిస్థితిని సమర్ధవంతంగా ఢీ కొట్టేందుకు టీడీపీ తరఫున కూడా బీసీలకు మెజారిటీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు చోట్ల తప్ప.. మిగిలిన స్థానాల్లో వైసీపీ ఎత్తుగడలను ఎదుర్కొనే లా బీసీలకే టికెట్లు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం ఎంపీ సీటు సహా.. పలు కీలక స్థానాలలో బీసీలకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే స్థానాల్లో భారీ మార్పుల దిశగానే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
పార్టీపరంగా చూసుకుంటే.. టీడీపీకి పాతకాపులు ఎక్కువగానే ఉన్నారు. వారిలోనూ అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికలపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వీరిలో తప్పదు అనుకున్నవారికి తప్ప.. మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని .. మిగిలిన స్తానాలను మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా పాత నేతల స్థానంలోనూ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ చేస్తున్న ప్రయోగాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా జగన్ వ్యూహానికి ప్రతివ్యూహం వేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
This post was last modified on January 28, 2024 10:00 pm
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…