అందరూ అనుకున్నట్టుగానే.. లెక్కలు పక్కాగా సరిపోవడంతో బిహార్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుత సీఎం, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నేత నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్వయంగా ఆయన పట్నాలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు అందించారు. తన రాజీనామా పత్రంలో నితీశ్ ఎలాంటి కారణాలను పేర్కొనకపోవడం గమనార్హం. ఇక, ఈ రాజీనామాను ఆగమేఘాలపై ఆమోదించేసిన గవర్నర్.. తాత్కాలిక ముఖ్యమంత్రిగాకొనసాగాలని కోరారు.
వాస్తవానికి బిహార్లో గత వారం రోజుల నుంచి రాజకీయాలు మారిపోయాయి. సీఎం నితీష్కుమార్.. తన పదవికి రాజీనామా చేస్తారనే చర్చ జోరుగా సాగింది. ఇప్పుడు.. రేపు.. సాయంత్రం అంటూ.. పెద్ద ఎత్తున జాతీయ మీడియాలోనూ కథనాలు హాట్హాట్గా సాగాయి. అయితే.. తొలుత అలాంటి దేమీ లేదని చెప్పిన నితీశ్.. తర్వాత.. సడెన్గా ఆయన ఆదివారం ఉదయం నేరుగా రాజ్భవన్ బాట పట్టారు. ప్రస్తుతం బిహార్లో మహాఘట్బంధన్ సర్కారు నడుస్తోంది.
లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతోనూ జట్టుకట్టిన నితీశ్.. ప్రబుత్వాన్ని ఏర్పా టు చేశారు. అయితే.. ఇది కూడా 2022 నుంచే. దీనికి ముందు 2021లో జరిగిన ఎన్నికల్లో నితీశ్ బీజేపీతో కలిసి ఉన్నారు. అప్పట్లో బీజేపీ కూటమి సర్కారునే ఏర్పాటు చేశారు. అయితే.. సీఎం సీటుకు ఎసరు పెడుతున్నారని గమనించిన నితీశ్ .. బీజేపీతో రాత్రికి రాత్రి కటీఫ్ చెప్పి.. ఆర్జేడీతో చేతులు కలిపారు. ఇక, ఆ తర్వాత.. మళ్లీ విభేదించారు. మళ్లీ కలిశారు. ఇక, ఇప్పుడు మరోసారి విడిపోయారు.
మొత్తంగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఇప్పటి వరకు మూడు సార్లు నితీశ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. రెండు సార్లు కూల్చేసుకోవడం గమనార్హం. ప్రస్తుత పరిణామాలకు కారణం.. కాంగ్రెస్తో ఇమడలేకపోవడం.. ప్రధాని సీటును ఆయనకు ఇండియా కూటమి ఇవ్వలేక పోవడం.. మరోవైపు మోడీ ప్రభజనం మరింత పెరిగిందనే అంచనా.. దీనికి తోడు.. జన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వడం వంటివి కారణాలు.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…