అందరూ అనుకున్నట్టుగానే.. లెక్కలు పక్కాగా సరిపోవడంతో బిహార్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుత సీఎం, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నేత నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్వయంగా ఆయన పట్నాలోని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు అందించారు. తన రాజీనామా పత్రంలో నితీశ్ ఎలాంటి కారణాలను పేర్కొనకపోవడం గమనార్హం. ఇక, ఈ రాజీనామాను ఆగమేఘాలపై ఆమోదించేసిన గవర్నర్.. తాత్కాలిక ముఖ్యమంత్రిగాకొనసాగాలని కోరారు.
వాస్తవానికి బిహార్లో గత వారం రోజుల నుంచి రాజకీయాలు మారిపోయాయి. సీఎం నితీష్కుమార్.. తన పదవికి రాజీనామా చేస్తారనే చర్చ జోరుగా సాగింది. ఇప్పుడు.. రేపు.. సాయంత్రం అంటూ.. పెద్ద ఎత్తున జాతీయ మీడియాలోనూ కథనాలు హాట్హాట్గా సాగాయి. అయితే.. తొలుత అలాంటి దేమీ లేదని చెప్పిన నితీశ్.. తర్వాత.. సడెన్గా ఆయన ఆదివారం ఉదయం నేరుగా రాజ్భవన్ బాట పట్టారు. ప్రస్తుతం బిహార్లో మహాఘట్బంధన్ సర్కారు నడుస్తోంది.
లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతోనూ జట్టుకట్టిన నితీశ్.. ప్రబుత్వాన్ని ఏర్పా టు చేశారు. అయితే.. ఇది కూడా 2022 నుంచే. దీనికి ముందు 2021లో జరిగిన ఎన్నికల్లో నితీశ్ బీజేపీతో కలిసి ఉన్నారు. అప్పట్లో బీజేపీ కూటమి సర్కారునే ఏర్పాటు చేశారు. అయితే.. సీఎం సీటుకు ఎసరు పెడుతున్నారని గమనించిన నితీశ్ .. బీజేపీతో రాత్రికి రాత్రి కటీఫ్ చెప్పి.. ఆర్జేడీతో చేతులు కలిపారు. ఇక, ఆ తర్వాత.. మళ్లీ విభేదించారు. మళ్లీ కలిశారు. ఇక, ఇప్పుడు మరోసారి విడిపోయారు.
మొత్తంగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఇప్పటి వరకు మూడు సార్లు నితీశ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. రెండు సార్లు కూల్చేసుకోవడం గమనార్హం. ప్రస్తుత పరిణామాలకు కారణం.. కాంగ్రెస్తో ఇమడలేకపోవడం.. ప్రధాని సీటును ఆయనకు ఇండియా కూటమి ఇవ్వలేక పోవడం.. మరోవైపు మోడీ ప్రభజనం మరింత పెరిగిందనే అంచనా.. దీనికి తోడు.. జన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వడం వంటివి కారణాలు.
This post was last modified on January 28, 2024 1:08 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…