ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎన్నికలకు ముందు.. విశాఖ నగర శివారులోని భీమిలి నియోజకవర్గంలో నిర్వహి స్తున్న భారీ బహిరంగ సభకు అంతే భారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 3 లక్షల మంది ప్రజలను తరలించడంతోపాటు.. వారి మద్దతు కూడా తమకే ఉందని చెప్పేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలో అనూహ్యంగా ప్రతిపక్ష నాయకుల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, సీపీఐ నేత రామకృష్ణ ల క్యారికేచర్ ఫొటోలతో కూడా భారీ ఫ్లెక్సీలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
దీంతో సభకు వచ్చిన వారు అమితాశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సభ అంటే గిట్టని విపక్షాలు ఏర్పాటు చేశాయా? లేక .. దుండగులు ఎవరైనా రాజకీయ ఉద్రిక్తతలకు ఒడిగట్టేందుకు ఈ కటౌట్లను ఏర్పాటు చేశారా? అనే చర్చ జోరుగా సాగింది. కానీ, ఒకింత లోతుగా ఆలోచిస్తే.. ఈ ప్రతిపక్ష నేతల కటౌట్లను వైసీపీ అధిష్టానం సూచనల మేరకు.. పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఒకపార్టీ బహిరంగ సభలో మరో పార్టీ జెండా ఎగరేసినా.. మరో పార్టీ నాయకుడి ప్రస్తావన వచ్చినా.. తీవ్ర రాజకీయ దుమారం రేగుతుంది.
అలాంటిది అధికార పార్టీ సభలో ప్రతిపక్ష నేతల కటౌట్లు కట్టం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. నిత్యం వైసీపీపై విమర్శలు గుప్పించే వీరిని సీఎం జగన్ తరచుగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. దుష్ట చతుష్టయం పేరుతో ప్రతిపక్షాలు, పత్రికాధిపతులపై సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. వారి విషయాలపై వ్యక్తిగత విమర్శలు కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇలాంటి నాయకుల కటౌట్లను ఏర్పాటు చేయడం.. సహజంగానే ఆసక్తిని రేపుతోంది.
అయితే.. ఇప్పటి వరకు.. వీరి పేర్లతో విమర్శించిన వైసీపీ అధినేత జగన్.. వీరి ఫొటోలను కూడా చూపిస్తూ.. రాజకీయ విమర్శలు చేసేందుకు.. ఇలా ఏర్పాట్లు చేశారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇలా అయితే.. ప్రజల్లో స్థిరంగా తాను చెప్పాలనుకున్న విషయం నిలిచిపోతుందని ఆయన అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు ఎవరూ ఏ పార్టీ కూడా చేయని విధంగా వైసీపీ సభలో ప్రతిపక్ష నాయకుల కటౌట్లు పెట్టారని అంటున్నారు.
This post was last modified on January 27, 2024 3:52 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…