Political News

ఢిల్లీకి ప‌వ‌న్‌.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా శుక్ర‌వారం గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా రెండు అసెంబ్లీ టికెట్లు ప్ర‌క‌టించుకున్నారు. రాజోలు, రాజాన‌గ‌రం సీట్ల‌లో జ‌న‌సేనే పోటీ చేస్తుంద‌ని ఆయ‌న వెల్లడించారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న టీడీపీ పై సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ‌కు చెప్ప‌కుండానే సీట్లు కేటాయించుకోవ‌డం.. సీఎం సీటు విష‌యంలో వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి పొత్తు ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని వ్యాఖ్యానించారు.

అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌తో ప‌వ‌న్ ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ నెల ఆఖ‌రులోగా పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంద‌ని..ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిసింది. అనంత‌రం.. అనూహ్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు త‌ర‌లి వెళ్లారు. శ‌నివారం, లేదా ఆదివారం బీజేపీ పెద్ద‌ల‌తో ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో ప‌వ‌న్ భేటీ కానున్నార‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఏపీలో పొత్తుల‌పై ఆయ‌న ఏదో ఒక తేల్చేసుకుంటార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నామ‌ని.. అయితే.. ఆ పార్టీ ఏదీ తేల్చ‌క‌పోవ‌డం.. క్షేత్ర‌స్తాయిలో టికెట్ల‌పై నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప‌వ‌న్‌పై ఒత్తిడి పెరిగింది.

ఈ నేప‌థ్యానికి తోడు.. వైసీపీ దూకుడుగా వెళ్తుండ‌డం.. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం కూడా ప‌వ‌న్‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. బీజేపీతో పొత్తు ఉంటే.. మూడు పార్టీలూ(జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ) సీట్ల‌ను పంచుకునే అవ‌కాశం ఉంది. లేక‌పోతే.. క‌మ్యూనిస్టులు లేదా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి ప‌వ‌న్‌.. పొత్తులతో ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నా రు. ఏదేమైనా ఈ నెల ఆఖ‌రు నాటికి తేల్చేయాల‌నే ఉద్దేశంతోనే ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్లార‌ని అంటున్నారు. బీజేపీ క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశ ఉంద‌ని.. వారు చెబుతున్నారు. లేక‌పోతే.. టీడీపీ, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి తాము ముందుకు వెళ్తామ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 26, 2024 7:35 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

1 hour ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

1 hour ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

1 hour ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago