Political News

ఢిల్లీకి ప‌వ‌న్‌.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా శుక్ర‌వారం గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా రెండు అసెంబ్లీ టికెట్లు ప్ర‌క‌టించుకున్నారు. రాజోలు, రాజాన‌గ‌రం సీట్ల‌లో జ‌న‌సేనే పోటీ చేస్తుంద‌ని ఆయ‌న వెల్లడించారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న టీడీపీ పై సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ‌కు చెప్ప‌కుండానే సీట్లు కేటాయించుకోవ‌డం.. సీఎం సీటు విష‌యంలో వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి పొత్తు ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని వ్యాఖ్యానించారు.

అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌తో ప‌వ‌న్ ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ నెల ఆఖ‌రులోగా పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంద‌ని..ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిసింది. అనంత‌రం.. అనూహ్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు త‌ర‌లి వెళ్లారు. శ‌నివారం, లేదా ఆదివారం బీజేపీ పెద్ద‌ల‌తో ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో ప‌వ‌న్ భేటీ కానున్నార‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఏపీలో పొత్తుల‌పై ఆయ‌న ఏదో ఒక తేల్చేసుకుంటార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నామ‌ని.. అయితే.. ఆ పార్టీ ఏదీ తేల్చ‌క‌పోవ‌డం.. క్షేత్ర‌స్తాయిలో టికెట్ల‌పై నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప‌వ‌న్‌పై ఒత్తిడి పెరిగింది.

ఈ నేప‌థ్యానికి తోడు.. వైసీపీ దూకుడుగా వెళ్తుండ‌డం.. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం కూడా ప‌వ‌న్‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. బీజేపీతో పొత్తు ఉంటే.. మూడు పార్టీలూ(జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ) సీట్ల‌ను పంచుకునే అవ‌కాశం ఉంది. లేక‌పోతే.. క‌మ్యూనిస్టులు లేదా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి ప‌వ‌న్‌.. పొత్తులతో ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నా రు. ఏదేమైనా ఈ నెల ఆఖ‌రు నాటికి తేల్చేయాల‌నే ఉద్దేశంతోనే ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్లార‌ని అంటున్నారు. బీజేపీ క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశ ఉంద‌ని.. వారు చెబుతున్నారు. లేక‌పోతే.. టీడీపీ, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి తాము ముందుకు వెళ్తామ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 26, 2024 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

1 hour ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

2 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

3 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago