ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తన దూకుడు ఏమా త్రం కూడా తగ్గించడం లేదు. వైసీపీపైనా.. సీఎం జగన్ సర్కారుపైనా ఆమె విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ ఆఫీస్ ఆంధ్ర రత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల సీఎం జగన్ విజయవాడలో ఆవిష్కరించిన డాక్టర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విగ్రహాలు పెడితే కడుపు నిండదని మండిపడ్డారు.
“అంబేద్కర్ అన్ని వర్గాల వారికి అభ్యున్నతి కోసం రాజ్యాంగం రాశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో జగనన్న ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయి.. అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదు., దళితులపై జరుగుతున్న దాడులు ఆగవు. వారి శోకం తీరదు. వారిని పట్టించుకుని, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడు మాత్రమే వారికి మేలు జరుగుతుంది. కానీ, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు” అని షర్మిల అన్నారు.
అంతేకాదు.. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకున్నారని.. సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. ఒక దళితుడు ఎదిరించాడని ఆయనకు గుండు గీసి అవమానించారని దుయ్యబట్టారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం ఎవరైనా చెబుతారని, కానీ అధికారంలో ఉన్నవారు ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
దళితుల పట్ల, ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు వైఎస్ షర్మిల ఈ సందర్భంగా పిలుఉనిచ్చారు. ఎవరు ఎస్సీ , ఎస్టీలకు మేలు చేశారో గుర్తించాలన్నారు. వైఎస్సార్ హయాంలో దళితులపై దాడులు జరగలేదన్నారు. ఆయన హయాంలోనే ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు వచ్చిందన్నారు. కానీ, ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని కొందరు దళితులను వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 26, 2024 2:03 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…