Political News

ష‌ర్మిల అదే రేంజ్‌.. త‌గ్గ‌ట్లేదుగా..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. త‌న దూకుడు ఏమా త్రం కూడా త‌గ్గించ‌డం లేదు. వైసీపీపైనా.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపైనా ఆమె విరుచుకుప‌డుతూనే ఉన్నారు. తాజాగా రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని పార్టీ ఆఫీస్ ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో ఆవిష్క‌రించిన డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. విగ్ర‌హాలు పెడితే క‌డుపు నిండ‌ద‌ని మండిప‌డ్డారు.

“అంబేద్క‌ర్‌ అన్ని వర్గాల వారికి అభ్యున్న‌తి కోసం రాజ్యాంగం రాశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయి.. అంబేద్క‌ర్ నిలువెత్తు విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదు., ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు ఆగ‌వు. వారి శోకం తీర‌దు. వారిని ప‌ట్టించుకుని, రాజ్యాంగాన్ని స‌క్ర‌మంగా అమ‌లు చేసినప్పుడు మాత్ర‌మే వారికి మేలు జ‌రుగుతుంది. కానీ, రాష్ట్రంలో ఆ ప‌రిస్థితి లేదు” అని ష‌ర్మిల అన్నారు.

అంతేకాదు.. ద‌ళితుల‌ను చంపేసి డోర్ డెలివ‌రీ చేసిన వారిని ప‌క్క‌న పెట్టుకున్నార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. ఒక ద‌ళితుడు ఎదిరించాడ‌ని ఆయ‌న‌కు గుండు గీసి అవమానించారని దుయ్య‌బ‌ట్టారు. అంబేద్క‌ర్‌ గురించి గొప్పగా చెప్పడం ఎవ‌రైనా చెబుతార‌ని, కానీ అధికారంలో ఉన్న‌వారు ఆయ‌న ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు కృషి చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటోంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

దళితుల ప‌ట్ల‌, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల ప‌ట్ల‌ కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని ప్ర‌జ‌ల‌కు వైఎస్ ష‌ర్మిల ఈ సంద‌ర్భంగా పిలుఉనిచ్చారు. ఎవ‌రు ఎస్సీ , ఎస్టీల‌కు మేలు చేశారో గుర్తించాల‌న్నారు. వైఎస్సార్ హ‌యాంలో ద‌ళితుల‌పై దాడులు జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆయ‌న హ‌యాంలోనే ఎస్టీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ అమ‌లుకు వ‌చ్చింద‌న్నారు. కానీ, ఈ రోజు ఆయ‌న పేరు చెప్పుకొని కొంద‌రు ద‌ళితుల‌ను వంచిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on January 26, 2024 2:03 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

42 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

50 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago