Political News

హ్యాపీ న్యూస్.. రైళ్లు పెరుగుతున్నాయ్

లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ఎత్తేశారు. అన్ని వ్యాపారాలూ న‌డుస్తున్నాయి. జ‌నాలు ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి తిరిగేస్తున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాత్రం రాక‌పోక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. బ‌స్సుల‌ను న‌డిపే విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతోంది.

ఆ వ్య‌వ‌హారం ఎంత‌కీ తేల‌ట్లేదు. రైళ్లు చూస్తే చాలా త‌క్కువ సంఖ్య‌లో న‌డుస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు సొంత వాహ‌నాల మీద ఆధార‌ప‌డుతున్నారు. లేదంటే భారీ రేట్లు పెట్టి ప్రైవేటు వాహ‌నాల్లో వెళ్లాల్సి వ‌స్తోంది. ప్ర‌జార‌వాణా పూర్తి స్థాయిలో ఎప్పుడు పునరుద్ధ‌రిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర రైల్వే శాఖ ఒక తీపికబురు చెప్పింది.

దేశ‌వ్యాప్తంగా రైళ్ల సంఖ్య‌ను పెంచ‌బోతున్నారు. భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి కొత్త‌గా 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. 10 నుంచి వీటిక‌కి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారం ప్ర‌క‌టించారు.

ఇందులో కొన్ని రైళ్లు ఏపీ తెలంగాణ ప‌రిధిలో రానున్నాయి. ఇప్ప‌టికే ఉన్న‌, కొత్త‌గా రాబోయే రైళ్ల‌లో వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదే మార్గంలో క్లోన్ ట్రైన్ల‌ను న‌డ‌ప‌బోతున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా కొత్త‌ రైళ్లను అందుబాటులో ఉంచుతామని కూడా ఆయ‌న చెప్పారు.

బ‌స్సుల స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో కానీ.. ఈ లోపు రైళ్ల సంఖ్య పెంచుతుండ‌టం శుభ‌వార్తే. హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం మార్గాల్లో డిమాండుకు త‌గ్గ‌ట్లు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

This post was last modified on September 6, 2020 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago