Political News

హ్యాపీ న్యూస్.. రైళ్లు పెరుగుతున్నాయ్

లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ఎత్తేశారు. అన్ని వ్యాపారాలూ న‌డుస్తున్నాయి. జ‌నాలు ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి తిరిగేస్తున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాత్రం రాక‌పోక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. బ‌స్సుల‌ను న‌డిపే విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతోంది.

ఆ వ్య‌వ‌హారం ఎంత‌కీ తేల‌ట్లేదు. రైళ్లు చూస్తే చాలా త‌క్కువ సంఖ్య‌లో న‌డుస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు సొంత వాహ‌నాల మీద ఆధార‌ప‌డుతున్నారు. లేదంటే భారీ రేట్లు పెట్టి ప్రైవేటు వాహ‌నాల్లో వెళ్లాల్సి వ‌స్తోంది. ప్ర‌జార‌వాణా పూర్తి స్థాయిలో ఎప్పుడు పునరుద్ధ‌రిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర రైల్వే శాఖ ఒక తీపికబురు చెప్పింది.

దేశ‌వ్యాప్తంగా రైళ్ల సంఖ్య‌ను పెంచ‌బోతున్నారు. భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి కొత్త‌గా 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. 10 నుంచి వీటిక‌కి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారం ప్ర‌క‌టించారు.

ఇందులో కొన్ని రైళ్లు ఏపీ తెలంగాణ ప‌రిధిలో రానున్నాయి. ఇప్ప‌టికే ఉన్న‌, కొత్త‌గా రాబోయే రైళ్ల‌లో వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదే మార్గంలో క్లోన్ ట్రైన్ల‌ను న‌డ‌ప‌బోతున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా కొత్త‌ రైళ్లను అందుబాటులో ఉంచుతామని కూడా ఆయ‌న చెప్పారు.

బ‌స్సుల స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో కానీ.. ఈ లోపు రైళ్ల సంఖ్య పెంచుతుండ‌టం శుభ‌వార్తే. హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం మార్గాల్లో డిమాండుకు త‌గ్గ‌ట్లు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

This post was last modified on September 6, 2020 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

10 minutes ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

45 minutes ago

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…

52 minutes ago

మల్టీస్టారర్ సినిమా మన దగ్గర లైటేనా

కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…

2 hours ago

స్పిరిట్ మీద నమ్మకంతోనే సల్మాన్ రిస్కు

కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…

3 hours ago

భగవంతుడు మీద ప్రతాప్ ప్రభావం

టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…

3 hours ago