లాక్ డౌన్ షరతులన్నీ ఎత్తేశారు. అన్ని వ్యాపారాలూ నడుస్తున్నాయి. జనాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేస్తున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం రాకపోకల్లో ఇబ్బందులు తప్పట్లేదు. బస్సులను నడిపే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
ఆ వ్యవహారం ఎంతకీ తేలట్లేదు. రైళ్లు చూస్తే చాలా తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. దీంతో ప్రజలు సొంత వాహనాల మీద ఆధారపడుతున్నారు. లేదంటే భారీ రేట్లు పెట్టి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. ప్రజారవాణా పూర్తి స్థాయిలో ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర రైల్వే శాఖ ఒక తీపికబురు చెప్పింది.
దేశవ్యాప్తంగా రైళ్ల సంఖ్యను పెంచబోతున్నారు. భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి కొత్తగా 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. 10 నుంచి వీటికకి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారం ప్రకటించారు.
ఇందులో కొన్ని రైళ్లు ఏపీ తెలంగాణ పరిధిలో రానున్నాయి. ఇప్పటికే ఉన్న, కొత్తగా రాబోయే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదే మార్గంలో క్లోన్ ట్రైన్లను నడపబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా కొత్త రైళ్లను అందుబాటులో ఉంచుతామని కూడా ఆయన చెప్పారు.
బస్సుల సమస్య ఎప్పుడు తీరుతుందో కానీ.. ఈ లోపు రైళ్ల సంఖ్య పెంచుతుండటం శుభవార్తే. హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం మార్గాల్లో డిమాండుకు తగ్గట్లు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…