సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్ 239, 240లో 11 ఎకరాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్ దాఖలైంది.
ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని, 5 రోజుల్లోనే పూర్తయిన ఈ ప్రక్రియ వల్ల ఖజానాకు 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ భూ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. ఆ పిటిషన్ లో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉండడంతో ఆయనపై, సంబంధిత రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, కేసీఆర్ ను పులితో పోల్చిన రేవంత్ రెడ్డి…ఆయనను త్వరలోనే బోనులో వేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన రోజే కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పులి బయటకు వస్తుందని బిల్లా, రంగా ఊరూరా ప్రచారం చేస్తున్నారని, పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకున్నారని, బయటకు రావాలని పరోక్షంగా కేసీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చని బీఆర్ఎస్కు కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. 100 రోజుల్లో 6 హామీలు పూర్తి చేస్తామన చెప్పామని, కానీ, 50 రోజులు గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 25, 2024 11:34 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…