Political News

కేసీఆర్ మెడకు కోకా పేట పంచాయతీ

సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్ 239, 240లో 11 ఎకరాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్‌ దాఖలైంది.

ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని, 5 రోజుల్లోనే పూర్తయిన ఈ ప్రక్రియ వల్ల ఖజానాకు 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ భూ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. ఆ పిటిషన్ లో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉండడంతో ఆయనపై, సంబంధిత రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, కేసీఆర్ ను పులితో పోల్చిన రేవంత్ రెడ్డి…ఆయనను త్వరలోనే బోనులో వేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన రోజే కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పులి బయటకు వస్తుందని బిల్లా, రంగా ఊరూరా ప్రచారం చేస్తున్నారని, పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో పడుకున్నారని, బయటకు రావాలని పరోక్షంగా కేసీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చని బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. 100 రోజుల్లో 6 హామీలు పూర్తి చేస్తామన చెప్పామని, కానీ, 50 రోజులు గడవక ముందే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on January 25, 2024 11:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

10 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

53 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago