Political News

అవును నేను గుంపు మేస్త్రీ యే : రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.

తాను గుంపు మేస్త్రీనేనని, బీఆర్ఎస్ నేతలు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని తానేనని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టిపిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తానని, కాచుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సంపదను దోచుకున్నవారిని కేసీఆర్ రాజ్యసభ సభ్యులు చేశారని ఆరోపించారు. 50వేలు కూడా లేకపోయినా మందుల శామ్యూల్ కు టికెట్ ఇచ్చి 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ అన్నారు. తాము ఇచ్చిన 6 హామీలలో మరో రెండు హామీల అమలు కోసం సిద్ధమయ్యామని, ఫిబ్రవరి నెల ఆఖరుకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.‌‌ కేంద్రంలో మోడీకైనా, రాష్ట్రంలో కేసీఆర్ కైనా బుద్ధి చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుచ్చారు. అఖండ భారత్ అని చెబుతున్న మోడీ… దేశం కోసం గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

This post was last modified on January 25, 2024 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

1 hour ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

2 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

2 hours ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

4 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

5 hours ago