తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.
తాను గుంపు మేస్త్రీనేనని, బీఆర్ఎస్ నేతలు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని తానేనని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టిపిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తానని, కాచుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సంపదను దోచుకున్నవారిని కేసీఆర్ రాజ్యసభ సభ్యులు చేశారని ఆరోపించారు. 50వేలు కూడా లేకపోయినా మందుల శామ్యూల్ కు టికెట్ ఇచ్చి 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ అన్నారు. తాము ఇచ్చిన 6 హామీలలో మరో రెండు హామీల అమలు కోసం సిద్ధమయ్యామని, ఫిబ్రవరి నెల ఆఖరుకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోడీకైనా, రాష్ట్రంలో కేసీఆర్ కైనా బుద్ధి చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుచ్చారు. అఖండ భారత్ అని చెబుతున్న మోడీ… దేశం కోసం గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
This post was last modified on January 25, 2024 10:31 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…