Political News

అవును నేను గుంపు మేస్త్రీ యే : రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.

తాను గుంపు మేస్త్రీనేనని, బీఆర్ఎస్ నేతలు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని తానేనని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలకు ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టిపిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తానని, కాచుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సంపదను దోచుకున్నవారిని కేసీఆర్ రాజ్యసభ సభ్యులు చేశారని ఆరోపించారు. 50వేలు కూడా లేకపోయినా మందుల శామ్యూల్ కు టికెట్ ఇచ్చి 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ అన్నారు. తాము ఇచ్చిన 6 హామీలలో మరో రెండు హామీల అమలు కోసం సిద్ధమయ్యామని, ఫిబ్రవరి నెల ఆఖరుకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.‌‌ కేంద్రంలో మోడీకైనా, రాష్ట్రంలో కేసీఆర్ కైనా బుద్ధి చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుచ్చారు. అఖండ భారత్ అని చెబుతున్న మోడీ… దేశం కోసం గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

This post was last modified on January 25, 2024 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

2 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago