కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు.
ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి వస్తున్న వార్తల్ని ఖండించనూ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రం కిమ్ సాధారణ స్థితిలో అయితే లేడన్నది స్పష్టమవుతోంది. అతను చనిపోవడమో.. కోమాలోకి వెళ్లడమో నిజమే అయితే ఉన్నట్లుండి అంత విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్.
దీని వెనుక అసలేం జరిగిందో ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కిమ్ ఇటీవల ఒక పర్యటనలో ఉండగా.. అతడికి గుండె పోటు వచ్చిందని.. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని.. ఐతే కిమ్ గుండెలో స్టంట్ వేయబోతుండగా.. డాక్టర్ చేతులు విపరీతంగా వణికాయని.. దీంతో శస్త్రచికిత్సలో తేడా జరిగిందని.. దీంతో అతడి పరిస్థితి విషమించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ నుంచి అతడి సోదరి కిమ్ జయో జాంగ్ అధ్యక్ష పదవిని అందుకోబోతోందని.. ఆమె కిమ్ను మించిన నియంత, కఠినాత్మురాలు అని.. ఇంతకుముందే అనేక దారుణాల్లో ఆమె పాలుపంచుకుందని చెబుతున్నారు. కిమ్కు ఈ పరిస్థితి రావడంలో సోదరి కుట్ర ఉండొచ్చనే కోణంలో కూడా వార్తలొస్తుండటం గమనార్హం….
This post was last modified on April 26, 2020 3:13 pm
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…