కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు.
ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి వస్తున్న వార్తల్ని ఖండించనూ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రం కిమ్ సాధారణ స్థితిలో అయితే లేడన్నది స్పష్టమవుతోంది. అతను చనిపోవడమో.. కోమాలోకి వెళ్లడమో నిజమే అయితే ఉన్నట్లుండి అంత విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్.
దీని వెనుక అసలేం జరిగిందో ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కిమ్ ఇటీవల ఒక పర్యటనలో ఉండగా.. అతడికి గుండె పోటు వచ్చిందని.. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని.. ఐతే కిమ్ గుండెలో స్టంట్ వేయబోతుండగా.. డాక్టర్ చేతులు విపరీతంగా వణికాయని.. దీంతో శస్త్రచికిత్సలో తేడా జరిగిందని.. దీంతో అతడి పరిస్థితి విషమించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ నుంచి అతడి సోదరి కిమ్ జయో జాంగ్ అధ్యక్ష పదవిని అందుకోబోతోందని.. ఆమె కిమ్ను మించిన నియంత, కఠినాత్మురాలు అని.. ఇంతకుముందే అనేక దారుణాల్లో ఆమె పాలుపంచుకుందని చెబుతున్నారు. కిమ్కు ఈ పరిస్థితి రావడంలో సోదరి కుట్ర ఉండొచ్చనే కోణంలో కూడా వార్తలొస్తుండటం గమనార్హం….
This post was last modified on April 26, 2020 3:13 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…