కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు.
ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి వస్తున్న వార్తల్ని ఖండించనూ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రం కిమ్ సాధారణ స్థితిలో అయితే లేడన్నది స్పష్టమవుతోంది. అతను చనిపోవడమో.. కోమాలోకి వెళ్లడమో నిజమే అయితే ఉన్నట్లుండి అంత విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్.
దీని వెనుక అసలేం జరిగిందో ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కిమ్ ఇటీవల ఒక పర్యటనలో ఉండగా.. అతడికి గుండె పోటు వచ్చిందని.. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని.. ఐతే కిమ్ గుండెలో స్టంట్ వేయబోతుండగా.. డాక్టర్ చేతులు విపరీతంగా వణికాయని.. దీంతో శస్త్రచికిత్సలో తేడా జరిగిందని.. దీంతో అతడి పరిస్థితి విషమించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ నుంచి అతడి సోదరి కిమ్ జయో జాంగ్ అధ్యక్ష పదవిని అందుకోబోతోందని.. ఆమె కిమ్ను మించిన నియంత, కఠినాత్మురాలు అని.. ఇంతకుముందే అనేక దారుణాల్లో ఆమె పాలుపంచుకుందని చెబుతున్నారు. కిమ్కు ఈ పరిస్థితి రావడంలో సోదరి కుట్ర ఉండొచ్చనే కోణంలో కూడా వార్తలొస్తుండటం గమనార్హం….
This post was last modified on April 26, 2020 3:13 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…