కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు.
ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి వస్తున్న వార్తల్ని ఖండించనూ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే మాత్రం కిమ్ సాధారణ స్థితిలో అయితే లేడన్నది స్పష్టమవుతోంది. అతను చనిపోవడమో.. కోమాలోకి వెళ్లడమో నిజమే అయితే ఉన్నట్లుండి అంత విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్.
దీని వెనుక అసలేం జరిగిందో ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కిమ్ ఇటీవల ఒక పర్యటనలో ఉండగా.. అతడికి గుండె పోటు వచ్చిందని.. ఐతే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారని.. ఐతే కిమ్ గుండెలో స్టంట్ వేయబోతుండగా.. డాక్టర్ చేతులు విపరీతంగా వణికాయని.. దీంతో శస్త్రచికిత్సలో తేడా జరిగిందని.. దీంతో అతడి పరిస్థితి విషమించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ నుంచి అతడి సోదరి కిమ్ జయో జాంగ్ అధ్యక్ష పదవిని అందుకోబోతోందని.. ఆమె కిమ్ను మించిన నియంత, కఠినాత్మురాలు అని.. ఇంతకుముందే అనేక దారుణాల్లో ఆమె పాలుపంచుకుందని చెబుతున్నారు. కిమ్కు ఈ పరిస్థితి రావడంలో సోదరి కుట్ర ఉండొచ్చనే కోణంలో కూడా వార్తలొస్తుండటం గమనార్హం….
This post was last modified on April 26, 2020 3:13 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…