వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కనీసం కాంగ్రెస్ పేరు కూడా పలకని ఆయన ఇప్పుడు ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గతం కూడా తవ్వుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడంలో ముందుందని అన్నారు. ప్రస్తుతం తమ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శలు గుప్పించారు. మంగళవారం తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.
వేదికపై ఆయన ప్రసంగిస్తూ.. అనూహ్యంగా కాంగ్రెస్ అంశాన్ని ప్రస్తావించారు. విభజించి పాలించు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వారు లేరన్నారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించింది. ఏపీ ప్రజలు ఎంత మొత్తుకున్నా.. ఏమాత్రం వినిపించుకోలేదు. విభజన చేసి తీరాలని భావించి అదే పనిచేసింది. ఆ తర్వాత.. నేను కాంగ్రెస్కు రాజీనామా చేశాక.. మా కుటుంబంలో తొలిసారి విభజన తీసుకువచ్చింది. మా చిన్నాన్న(వైఎస్ వివేకానందరెడ్డి)ను మాకు దూరం చేసి.. మాపైనే ఉసిగొల్పింది” అని జగన్ చెప్పారు.
అంతేకాదు.. వివేకాను తమపైనే పోటీకి పెట్టి.. తమపైనే విమర్శలు చేయించిందని జగన్ అన్నారు. ఇప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఇదే పనిచేస్తోందని.. పరోక్షంగా తన సోదరి షర్మిలకు కాంగ్రెస్ ఏపీ పగ్గాలు అప్పగించడాన్ని ఆయన ప్రస్తావించారు. విబజించి పాలించే నైజం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఆ దేవుడే గుణపాఠం నేర్పుతాడని వ్యాఖ్యానించారు. తాము ప్రజలను నమ్ముకున్నామని జగన్ చెప్పారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో అమలు కాని అనేక సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా వాటి వివరాలను.. ప్రజల ఖాతాల్లో వేస్తున్న నిధుల వివరాలను కూడా జగన్ వెల్లడించారు.
This post was last modified on January 24, 2024 9:31 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…