Political News

కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెడుతోంది: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం కాంగ్రెస్ పేరు కూడా ప‌ల‌క‌ని ఆయ‌న ఇప్పుడు ఆక‌స్మికంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా గ‌తం కూడా త‌వ్వుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్న‌క‌ర రాజ‌కీయాలు చేయ‌డంలో ముందుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌మ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. మంగ‌ళ‌వారం తిరుప‌తిలో ఇండియా టుడే స‌మ్మిట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు.

వేదిక‌పై ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. అనూహ్యంగా కాంగ్రెస్ అంశాన్ని ప్ర‌స్తావించారు. విభ‌జించి పాలించు రాజ‌కీయాలు చేయ‌డంలో కాంగ్రెస్ పార్టీని మించిన వారు లేర‌న్నారు. త‌మ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింద‌ని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభ‌జించింది. ఏపీ ప్ర‌జ‌లు ఎంత మొత్తుకున్నా.. ఏమాత్రం వినిపించుకోలేదు. విభ‌జ‌న చేసి తీరాల‌ని భావించి అదే ప‌నిచేసింది. ఆ త‌ర్వాత‌.. నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక‌.. మా కుటుంబంలో తొలిసారి విభ‌జ‌న తీసుకువ‌చ్చింది. మా చిన్నాన్న‌(వైఎస్ వివేకానంద‌రెడ్డి)ను మాకు దూరం చేసి.. మాపైనే ఉసిగొల్పింది” అని జ‌గ‌న్ చెప్పారు.

అంతేకాదు.. వివేకాను త‌మ‌పైనే పోటీకి పెట్టి.. త‌మ‌పైనే విమ‌ర్శ‌లు చేయించింద‌ని జ‌గ‌న్ అన్నారు. ఇప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఇదే ప‌నిచేస్తోంద‌ని.. ప‌రోక్షంగా త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కాంగ్రెస్ ఏపీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. విబ‌జించి పాలించే నైజం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని అన్నారు. ఆ దేవుడే గుణ‌పాఠం నేర్పుతాడ‌ని వ్యాఖ్యానించారు. తాము ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్రంలో అమ‌లు కాని అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను తాము అమ‌లు చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వాటి వివ‌రాల‌ను.. ప్ర‌జ‌ల ఖాతాల్లో వేస్తున్న నిధుల వివ‌రాల‌ను కూడా జ‌గ‌న్ వెల్ల‌డించారు.

This post was last modified on January 24, 2024 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago