ఏపీలో కీలక పార్టీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది.
అయితే.. ఆ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీగానే జనసేన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పార్టీలకు శాస్వతంగా గుర్తుల కేటాయింపు ఉండదు. దీంతో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వివాదంగా మారింది. ఎన్నికల పోలింగ్ చివరి నిముషం వరకు కూడా ఈ సందేహాలు.. ఊగిసలాడాయి. మరోవైపు.. ఇది రాజకీయంగా కూడా ఇరకాటంలోకి నెట్టింది. అయితే..ఎట్టకేలకు అప్పట్లో ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణలో జనసేన అభ్యర్తులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.
ఇక, ఇప్పుడు త్వరలోనే ఏపీ అసెంబ్లీ తో పాటుపార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో జనసేన ఎన్నికల గుర్తు వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో గుర్తు విషయంపై పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు సంధించారు. వీటిని పరిశీలించిన సంఘం. ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేనకు కేటాయిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన అభ్యర్ధులు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల బరిలో నిలవనున్నారు.
This post was last modified on January 24, 2024 9:26 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…