Political News

జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తే.. ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల స‌మయంలో జ‌న‌సేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది.

అయితే.. ఆ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీగానే జ‌న‌సేన కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పార్టీలకు శాస్వ‌తంగా గుర్తుల కేటాయింపు ఉండ‌దు. దీంతో గ‌త ఏడాది జ‌రిగిన‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వివాదంగా మారింది. ఎన్నిక‌ల పోలింగ్ చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఈ సందేహాలు.. ఊగిస‌లాడాయి. మ‌రోవైపు.. ఇది రాజ‌కీయంగా కూడా ఇర‌కాటంలోకి నెట్టింది. అయితే..ఎట్ట‌కేల‌కు అప్ప‌ట్లో ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణలో జ‌న‌సేన అభ్య‌ర్తులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.

ఇక‌, ఇప్పుడు త్వ‌ర‌లోనే ఏపీ అసెంబ్లీ తో పాటుపార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. దీంతో జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో గుర్తు విష‌యంపై పార్టీ నాయ‌కులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు సంధించారు. వీటిని ప‌రిశీలించిన సంఘం. ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేనకు కేటాయిస్తూ.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌సేన‌ అభ్యర్ధులు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల బరిలో నిలవనున్నారు.

This post was last modified on January 24, 2024 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago