ఏపీలో కీలక పార్టీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది.
అయితే.. ఆ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీగానే జనసేన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పార్టీలకు శాస్వతంగా గుర్తుల కేటాయింపు ఉండదు. దీంతో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వివాదంగా మారింది. ఎన్నికల పోలింగ్ చివరి నిముషం వరకు కూడా ఈ సందేహాలు.. ఊగిసలాడాయి. మరోవైపు.. ఇది రాజకీయంగా కూడా ఇరకాటంలోకి నెట్టింది. అయితే..ఎట్టకేలకు అప్పట్లో ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణలో జనసేన అభ్యర్తులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.
ఇక, ఇప్పుడు త్వరలోనే ఏపీ అసెంబ్లీ తో పాటుపార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో జనసేన ఎన్నికల గుర్తు వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో గుర్తు విషయంపై పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు సంధించారు. వీటిని పరిశీలించిన సంఘం. ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేనకు కేటాయిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన అభ్యర్ధులు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల బరిలో నిలవనున్నారు.
This post was last modified on January 24, 2024 9:26 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…