Political News

జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తే.. ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల స‌మయంలో జ‌న‌సేన గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది.

అయితే.. ఆ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీగానే జ‌న‌సేన కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పార్టీలకు శాస్వ‌తంగా గుర్తుల కేటాయింపు ఉండ‌దు. దీంతో గ‌త ఏడాది జ‌రిగిన‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వివాదంగా మారింది. ఎన్నిక‌ల పోలింగ్ చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఈ సందేహాలు.. ఊగిస‌లాడాయి. మ‌రోవైపు.. ఇది రాజ‌కీయంగా కూడా ఇర‌కాటంలోకి నెట్టింది. అయితే..ఎట్ట‌కేల‌కు అప్ప‌ట్లో ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తెలంగాణలో జ‌న‌సేన అభ్య‌ర్తులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.

ఇక‌, ఇప్పుడు త్వ‌ర‌లోనే ఏపీ అసెంబ్లీ తో పాటుపార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. దీంతో జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో గుర్తు విష‌యంపై పార్టీ నాయ‌కులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు సంధించారు. వీటిని ప‌రిశీలించిన సంఘం. ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేనకు కేటాయిస్తూ.. తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌సేన‌ అభ్యర్ధులు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల బరిలో నిలవనున్నారు.

This post was last modified on January 24, 2024 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

1 hour ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

2 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

2 hours ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

4 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

5 hours ago