Political News

బీఆర్ఎస్ మళ్ళీ ఫోకస్ పెట్టిందా ?

తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై బాగా ఫోకస్ పెట్టింది. ప్రచారానికి సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ ఫారంను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలన్నది టార్గెట్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రయత్నంచేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో సిట్టింగులపైన జనాల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకతే ప్రధాన కారణంగా నిలిచింది. సిట్టింగులపైన వ్యతిరేకత కారణంగా పార్టీ తరపున ఎంత పాజిటివ్ ప్రచారం చేయించినా ఉపయోగం కనబడలేదు.

ఆ విషయాన్ని కేటీయార్ ఇపుడు గుర్తుపెట్టుకున్నట్లున్నారు. అందుకనే పార్లమెంటుకు పోటీచేయబోయే అభ్యర్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని నేతలు, క్యాడర్ కు హామీఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కానివ్వమని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలీదు. అందుకనే అభ్యర్ధులు అని కాకుండా అచ్చంగా పార్టీకే ప్రధానత్య ఇస్తు పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో సోషల్ మీడియాను ఉపయోగంచుకోవాలని అనుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలోను ఒక పెద్ద బృందాన్నే ప్రచారం కోసం దింపారు. అవే బృందాలను ఇపుడు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయించాలని ఆలోచిస్తున్నారు. నియోజకవర్గాల్లో అప్పట్లో సోషల్ మీడియా ప్రచార బృందాలు పనిచేసిన విధానంపై పార్టీ నేతల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు కేటీయార్. ఏ నియోజకవర్గంలో అయినా సోషల్ మీడియా ప్రచారం సరిగా జరగలేదన్నా, పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్న ఫీడ్ బ్యాక్ వచ్చినట్లయితే ఆ బృందాల పనితీరును సమీక్షించాలని కేటీయార్ డిసైడ్ అయ్యారు.

ఇప్పటికి డిసైడ్ చేసిందేమిటంటే అభ్యర్ధులు అనికాకుండా పార్టీ తరపున సోషల్ మీడియా ప్రచారాన్ని రంగంలోకి దింపాలని. పనిలోపనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్లను కూడా పదేపదే ప్రస్తావించాలని అనుకున్నారు. సిక్స్ గ్యారెంటీస్ అమలుచేయటంలో ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని బాగా హైలైట్ చేయాలని కేటీయార్, హరీష్ ఇప్పటికే సోషల్ మీడియా ప్రచార బాధ్యులకు గట్టిగా చెప్పారట. కరీంనగర్ పార్లమెంటుకు చెందిన సోషల్ మీడియా వారియర్స్ తో పార్టీ ఆఫీసులో కేటీయార్ సమావేశం అవబోతున్నారు. ఈ సమావేశానికి ఏడు అసెంబ్లీల్లో గెలిచిన ఎంఎల్ఏలు, ఓడిన అభ్యర్ధులతో పాటు సీనియర్ నేతలను కూడా ఆహ్వానించారు. సమావేశంలో ఏమి చెబుతారో చూడాలి.

This post was last modified on January 24, 2024 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago