Political News

కష్టపడ్డవారికే ప్రయారిటీయా ?

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం ఇందులో భాగమే.

మల్లు, హర్కార, వేంలు పోయిన ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ రూరల్లో పోటీచేసి ఓడిపోయారు. టికెట్లను త్యాగంచేసినందుకు మొదటి ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పోటీచేసి ఓడిపోయినా షబ్బీర్ కు పదవి ఎందుకు దక్కిందంటే ముస్లిం మైనారిటి ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు కష్టపడినందుకట. పైగా పార్టీ తరపున పోటీచేసిన ముస్లిం అభ్యర్ధులందరు ఓడిపోయారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అందుకనే షబ్బీర్ కు సలహాదారు పదవిని కట్టబెట్టారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎంఎల్సీ పదవి ద్వారా మంత్రవ్వాలన్న షబ్బీర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారు. షబ్బీర్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచిదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పోటీకి అవకాశం దక్కని వాళ్ళకి, గెలుపుకోసం కష్టపడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీలో చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో చూస్తే షబ్బీర్ ను పోటీనుండి తప్పించటం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇదే పద్దతిలో తొందరలోనే మరో 20మందికి నామినేటెడ్ పోస్టుల యోగం పట్టబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. విడతలవారీగా చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లను సామాజికవర్గాల సమతూకంగా నియమించబోతున్నారట. లిస్టు ఫైనల్ కాగానే అధిష్టానంకు పంపించి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. అనుమతి రాగానే వెంటనే నియామకాలు అయిపోతాయని సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనే సిగ్నల్ ఇవ్వటం కోసమే ఈ నియామకాలను చేయబోతున్నారు. మొదటి విడత భర్తీని ఇపుడు చేసి రెండో విడత భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలని అనుకున్నట్లు సమాచారం.

This post was last modified on January 24, 2024 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

21 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

28 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

58 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago