Political News

కష్టపడ్డవారికే ప్రయారిటీయా ?

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం ఇందులో భాగమే.

మల్లు, హర్కార, వేంలు పోయిన ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ రూరల్లో పోటీచేసి ఓడిపోయారు. టికెట్లను త్యాగంచేసినందుకు మొదటి ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పోటీచేసి ఓడిపోయినా షబ్బీర్ కు పదవి ఎందుకు దక్కిందంటే ముస్లిం మైనారిటి ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు కష్టపడినందుకట. పైగా పార్టీ తరపున పోటీచేసిన ముస్లిం అభ్యర్ధులందరు ఓడిపోయారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అందుకనే షబ్బీర్ కు సలహాదారు పదవిని కట్టబెట్టారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎంఎల్సీ పదవి ద్వారా మంత్రవ్వాలన్న షబ్బీర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారు. షబ్బీర్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచిదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పోటీకి అవకాశం దక్కని వాళ్ళకి, గెలుపుకోసం కష్టపడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీలో చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో చూస్తే షబ్బీర్ ను పోటీనుండి తప్పించటం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇదే పద్దతిలో తొందరలోనే మరో 20మందికి నామినేటెడ్ పోస్టుల యోగం పట్టబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. విడతలవారీగా చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లను సామాజికవర్గాల సమతూకంగా నియమించబోతున్నారట. లిస్టు ఫైనల్ కాగానే అధిష్టానంకు పంపించి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. అనుమతి రాగానే వెంటనే నియామకాలు అయిపోతాయని సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనే సిగ్నల్ ఇవ్వటం కోసమే ఈ నియామకాలను చేయబోతున్నారు. మొదటి విడత భర్తీని ఇపుడు చేసి రెండో విడత భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలని అనుకున్నట్లు సమాచారం.

This post was last modified on January 24, 2024 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

51 minutes ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

2 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

6 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

7 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

9 hours ago