రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం ఇందులో భాగమే.
మల్లు, హర్కార, వేంలు పోయిన ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ రూరల్లో పోటీచేసి ఓడిపోయారు. టికెట్లను త్యాగంచేసినందుకు మొదటి ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పోటీచేసి ఓడిపోయినా షబ్బీర్ కు పదవి ఎందుకు దక్కిందంటే ముస్లిం మైనారిటి ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు కష్టపడినందుకట. పైగా పార్టీ తరపున పోటీచేసిన ముస్లిం అభ్యర్ధులందరు ఓడిపోయారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అందుకనే షబ్బీర్ కు సలహాదారు పదవిని కట్టబెట్టారు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎంఎల్సీ పదవి ద్వారా మంత్రవ్వాలన్న షబ్బీర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారు. షబ్బీర్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచిదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పోటీకి అవకాశం దక్కని వాళ్ళకి, గెలుపుకోసం కష్టపడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీలో చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో చూస్తే షబ్బీర్ ను పోటీనుండి తప్పించటం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇదే పద్దతిలో తొందరలోనే మరో 20మందికి నామినేటెడ్ పోస్టుల యోగం పట్టబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. విడతలవారీగా చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లను సామాజికవర్గాల సమతూకంగా నియమించబోతున్నారట. లిస్టు ఫైనల్ కాగానే అధిష్టానంకు పంపించి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. అనుమతి రాగానే వెంటనే నియామకాలు అయిపోతాయని సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనే సిగ్నల్ ఇవ్వటం కోసమే ఈ నియామకాలను చేయబోతున్నారు. మొదటి విడత భర్తీని ఇపుడు చేసి రెండో విడత భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలని అనుకున్నట్లు సమాచారం.
This post was last modified on January 24, 2024 11:51 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…