Political News

కష్టపడ్డవారికే ప్రయారిటీయా ?

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం ఇందులో భాగమే.

మల్లు, హర్కార, వేంలు పోయిన ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ రూరల్లో పోటీచేసి ఓడిపోయారు. టికెట్లను త్యాగంచేసినందుకు మొదటి ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పోటీచేసి ఓడిపోయినా షబ్బీర్ కు పదవి ఎందుకు దక్కిందంటే ముస్లిం మైనారిటి ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు కష్టపడినందుకట. పైగా పార్టీ తరపున పోటీచేసిన ముస్లిం అభ్యర్ధులందరు ఓడిపోయారు. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అందుకనే షబ్బీర్ కు సలహాదారు పదవిని కట్టబెట్టారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎంఎల్సీ పదవి ద్వారా మంత్రవ్వాలన్న షబ్బీర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారు. షబ్బీర్ విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచిదనే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పోటీకి అవకాశం దక్కని వాళ్ళకి, గెలుపుకోసం కష్టపడిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇవ్వాలని పార్టీలో చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలో చూస్తే షబ్బీర్ ను పోటీనుండి తప్పించటం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇదే పద్దతిలో తొందరలోనే మరో 20మందికి నామినేటెడ్ పోస్టుల యోగం పట్టబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. విడతలవారీగా చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లను సామాజికవర్గాల సమతూకంగా నియమించబోతున్నారట. లిస్టు ఫైనల్ కాగానే అధిష్టానంకు పంపించి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. అనుమతి రాగానే వెంటనే నియామకాలు అయిపోతాయని సమాచారం. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనే సిగ్నల్ ఇవ్వటం కోసమే ఈ నియామకాలను చేయబోతున్నారు. మొదటి విడత భర్తీని ఇపుడు చేసి రెండో విడత భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలని అనుకున్నట్లు సమాచారం.

Satya

Recent Posts

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

18 minutes ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

1 hour ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

2 hours ago

ఇది టూమ‌చ్ డైరెక్టర్ గారు…

త‌మ సినిమాల మీద‌, దాని కోసం ప‌నిచేసిన‌ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల మీద ఆయా చిత్ర బృందాల‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉండొచ్చు.…

3 hours ago

హోర్ముజ్ మ‌ళ్లీ మూత‌… ప్ర‌పంచం దిగ్భ్రాంతి!

ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ప‌రిధిలో ప్ర‌పంచ వాణిజ్య నౌకార‌వాణాకు అత్యంత కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసి వేస్తున్న‌ట్టు…

3 hours ago

రక్తచరిత్రని మళ్ళీ చూస్తారా

శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన…

3 hours ago