Political News

అమ్మో ష‌ర్మిల‌.. ఊపిరాడ‌నివ్వ‌డం లేదుగా!

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్ష‌ణం తీరిక లేకుండా విమ‌ర్శ‌ల శ‌రాలు సంధిస్తున్నారు. మంగ‌ళ‌వారం జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించిన ష‌ర్మిల‌.. శ్రీకాకుళంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను ఆర్టీసీ బ‌స్సు నుంచే ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, త‌న సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమ‌ర్శ‌లు సంధించారు. అదేస‌మ‌యంలో అభివృద్ధి స‌వాళ్లు సంధించారు. పోల‌వ‌రం నుంచి ప్రాజెక్టుల వ‌ర‌కు, ర‌హ‌దారుల నుంచి మెట్రో రైళ్ల వ‌ర‌కు ఇలా.. అనేక అంశాల్లో అభివృద్ది ఎక్క‌డ ఉందంటూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. దీనికి ఇంకా వైసీపీ రియాక్ట్ కావాల్సి ఉంది.

కానీ, ఇంత‌లోనే వైసీపీపై మ‌రికొన్ని విమ‌ర్శ‌ల‌తో ష‌ర్మిల రెచ్చిపోయారు. కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా అంశాన్ని, బీజేపీతో వైసీపీ బంధాన్ని ఆమె లేవనెత్తారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల ఓట్లు వేయించుకునేందుకు వైసీపీ ప్ర‌త్యేక హోదా అంశాన్ని భుజాల‌పై వేసుకుంద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే కేంద్రం మెడ‌లు వంచైనా స‌రే.. ఖ‌చ్చితంగా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని తేల్చి చెప్పింద‌ని.. మ‌రి ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో మెడ‌లు ఎందుకు వంచ‌లేక పోయార‌ని ష‌ర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఒక్క‌సారైనా పార్ల‌మెంటులో నిల‌దీశారా? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. “జ‌గ‌న‌న్న‌గారూ.. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రాన్ని ఎప్పుడైనా నిల‌దీశారా? క‌నీసం ప్ర‌శ్నించారా? ” అని షర్మిల నిల‌దీశారు. శ్రీకాకుళం జిల్లా బోర్డ‌ర్ ఇచ్ఛాపురంలో గ‌తంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా నిర్మించిన పైలాన్ ను ష‌ర్మిల సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఆమె ప్ర‌సంగిస్తూ.. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న‌న్న గారు.. ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని సెల‌విచ్చారు. కేంద్రం మెడలు కూడా వంచుతామ‌న్నారు. ఇప్పుడు ఏమంది జ‌గ‌న‌న్న‌గారూ..స‌మాధానం చెప్పాలి” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

కాగా, ష‌ర్మిల తొలి రోజు ప‌ర్య‌ట‌న‌ల‌తోనే ఇంత దూకుడు చూపిస్తే.. రాబోయే రోజుల్లో మ‌రింత‌గాఆమె దూకుడు ఉండే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇలా వైసీపీని టార్గెట్ చేయ‌డం ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటుందా? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. ఉద్దేశ‌పూర్వ‌కంగానే అన్న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి ఇదే వాద‌న వెళ్లి బ‌ల‌ప‌డితే.. ఆమెకు, ఆమె రాజ‌కీయాల‌కు కూడా ఇబ్బందేనని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on January 23, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

13 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

15 hours ago