Political News

సీఎం రేవంత్ తో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల భేటీ..

తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత ఆస‌క్తికర ఘ‌ట్టం చోటు చేసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయ‌కులు ఒకే చోట చేర‌డం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావ‌డం.. ఎవ‌రూ ఊహించి కూడా ఉండ‌రు. కానీ, నిజంగానే జ‌రిగింది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌ను త‌న నివాసంలో క‌లిసిన న‌లుగురు ఎమ్మెల్యేలు.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినందున అభినంద‌న‌లు తెలిపామ‌న్నారు.

సీఎం రేవంత్‌ను క‌లిసిన వారిలో న‌ర‌సాపూర్ ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప‌టాన్ చెరు ఎమ్మెల్యే మ‌హిపాల్‌రెడ్డి, జ‌హీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఉన్నారు. వీరు వ‌స్తున్నార‌న్న విష‌యం ముందుగానే తెలుసుకున్న రేవంత్‌రెడ్డి.. సాద‌రంగా వారిని ఆయ‌న ఆహ్వానించారు. పుష్ప‌గుచ్చాలు స్వీక‌రించి.. సంతోష ప‌రిచారు. అనంత‌రం బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు సీఎం రేవంత్ తేనీటి విందు ఇచ్చారు. అయితే.. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కానీ, దీనికి అంత ప్రాధాన్యం లేద‌ని, మ‌ర్యాద పూర్వ‌కంగానే తాము సీఎం రేవంత్ను క‌లిసామ‌ని.. వారు చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను చూసేందుకు, క‌నీసం వారితో మాట్లాడేందుకు.. వారి వ‌స్తున్నారంటే.. ఆ దారిలో వెళ్లేందుకు కూడా నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థిత్వం అంటే.. కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమితం అయ్యేది. త‌ర్వాత‌.. నాయ‌కులు క‌లివిడిగానే ఉండేవారు. బంధుత్వాలు కూడా ఉన్న‌వారు ఉన్నారు. కానీ, రాను రాను ప్రాంతీయ పార్టీల హ‌వా పెరిగిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు అంటే.. దూష‌ణ‌లు, విమ‌ర్శ‌లు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా తెర‌మీదికి తీసుకురావ‌డం వంటివిగా త‌యారై.. అస‌లు ప్ర‌త్య‌ర్థులు ఒక‌రి ముఖం ఒక‌రు చూసుకోలేనంత‌గా మారిపోయింది.

తెలంగాణ‌లో అయినా.. ఏపీలో ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంది. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీస్తూ.. త‌న‌ను క‌లుసుకోవాలని, అభినందించాల‌ని భావించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం, వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డం.. వారితో క‌లిసి పొటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం వంటివి మారుతున్న‌రాజ‌కీయాలు నాంది అనే మాట వినిపిస్తోంది. రాజ‌కీయాలు అంటే.. రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావాల‌న్న మేధావుల సూచ‌న అమ‌ల‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

Satya

Recent Posts

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

43 minutes ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

1 hour ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

2 hours ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

2 hours ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

4 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

5 hours ago