Political News

ఏపీలో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురికి కరోనా?

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా వ్యాపిస్తోన్న తొలినాళ్లలో ఏపీలో పరిస్థితి అదుపులో ఉంది. ఢిల్లీ లింక్ బయటపడ్డ తర్వాత ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరింది.

ఇక, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో టాప్ ప్లేసులో ఉన్న కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కర్నూలులో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురు డాక్టర్లు సహా ఆరుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది కర్నూలులో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 279 కి చేరింది.

కరోనా బారిన పడి 9మంది మరణించారు. 31మంది డిశ్చార్జ్ అయ్యారు. మొదట పెద్దగా కేసులు లేని కర్నూలులో కరోనా చాపకింద నీరులా వ్యాపించింది. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాగా ఉన్న కర్నూలు రోజుల వ్యవధిలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా మారడం చర్చనీయాంశమైంది.

కర్నూలులో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురు డాక్టర్లు సహా ఆరుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఆ ఎంపీ కూతురికి రావడంతో ఎంపీ కుటుంబాన్ని కూడా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెట్టారని తెలుస్తోంది. ఇప్పటిదాకా కర్నూలులో మొత్తం 7గురు డాక్టర్లకు కరోనా సోకింది. వారిలో ఒక డాక్టర్ మరణించారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకిందన్న వదంతులు వస్తున్నాయి. అయితే, సదరు ఎమ్మెల్యేకు ఇంకా కరోనా నిర్ధారణ టెస్టులు చేయలేదని, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలోని క్వారంటైన్లో ఆ ఎమ్మెల్యే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు, నంద్యాలలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కరోనాను కట్టడి చేశారు.

ఆత్మకూరు, నందికొట్కూర్, బనాగానపల్లె…కంట్రోల్ లోకి వచ్చాయి. కర్నూల్, నంద్యాలలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం లేదు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

This post was last modified on April 26, 2020 3:14 pm

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

34 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago