Political News

30 మంది కాంగ్రెస్ లోకి వచ్చేస్తారంటున్న కోమటిరెడ్డి

సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్లుగా చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ తో పాటు పలువురు మాజీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.

యాదాద్రి.. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్ గఢ్ లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే తన మీద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విద్యుత్కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్.. సిట్టింగ్ జడ్జి విచారణ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళుతుందన్న ఆయన.. తమ ప్రభుత్వం పడిపోదన్నారు.

ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న ఆయన.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని వ్యాఖ్యానించటం గమనార్హం. కాంగ్రెస్ లోకి 30 మంది ఎమ్మెల్యేలు వస్తారన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్రుణప్రాయంగా విడిచిపెట్టానని.. అలాంటి తనపై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.

వందరోజుల్లోపు తాము హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి.. కరెంటు బిల్లులు కొట్టొద్దన్న మాటలు మాట్లాడటం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కు సూచన చేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సర్కారు మీదా.. ముఖ్యమంత్రి రేవంత్ మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ లు సరైన రీతిలో రియాక్టు కావట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్న మాటలతో ఆయన ఆ విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పాలి. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవనీయ స్థానాల్ని సొంతం చేసుకుంటే తప్పించి పట్టు సాధించలేదన్న విషయాన్ని కోమటిరెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు.

This post was last modified on January 23, 2024 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

58 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

1 hour ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

4 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

5 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

5 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

7 hours ago