Political News

మేడిగడ్డ పై విజిలెన్స్ సంచలన నివేదిక ?

అత్యంత వివాదాస్పదమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ ఉన్నతాధికారులు రెడీచేస్తున్న నివేదిక సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలోని నాసిరకమంతా నివేదికలో బయటపడిందిట. బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోవటం సంచలనమైంది. బ్యారేజి నాణ్యతపై కాంగ్రెస్, బీజేపీలు సంధించిన ప్రశ్నలకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు సమాధానం కూడా చెప్పుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి అండ్ కో ఎన్నిసార్లు ప్రశ్నించినా కేసీయార్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడకపోవటమే కాకుండా ఎవరినీ మాట్లాడద్దని అప్పట్లో ఆదేశించారని వార్తలొచ్చిన మాట అందరికీ తెలిసిందే.

దాంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి అత్యంత నాసిరకంగా నిర్మించారనే ఆరోపణలతో కాంగ్రెస్ చెలరేగిపోయింది. ఇలాంటి అనేక ఆరోపణలకు కేసీయార్ సమాధానం చెప్పుకోలేకపోవటంతో చివరకు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మేడిగడ్డ బ్యారేజి నాణ్యతపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ నాయకత్వంలో కొందరు నిపుణుల సాయంతో మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన ఫైళ్ళను అధ్యయనం చేశారు. తర్వాత దీనిపైన ప్రభుత్వానికి రిపోర్టు అందించబోతున్నారు.

ఆ రిపోర్టులో బ్యారేజి నిర్మాణం సమస్ధం అత్యంత నాసిరకంగా చేసినట్లు చెప్పబోతున్నట్లు సమాచారం. నిపుణులతో మాట్లాడినపుడు వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట. విజిలెన్స్ తరపున ఇరిగేషన్ ఫీల్డులో బాగా అనుభవం ఉన్న కొందరు నిపుణులు నాలుగు రోజులు మేడిగడ్డను అధ్యయనం చేశారట. ప్రాజెక్టు నిర్మాణమే అత్యంత నాసిరకంగా జరిగిందని, నిర్మాణం తర్వాత కూడా నిర్మాణ సంస్ధ నిర్వహణ సరిగా లేదని నిపుణులు అభిప్రాయపడ్డారట. నిర్మాణానికి, నిర్వహణ సరిగా లేకపోవటానికి నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టి సంస్ధదే బాధ్యతగా తేల్చారట.

అసలు బ్యారేజి పునాదుల్లోనే అవినీతి జరిగిన కారణంగానే పిల్లర్లు కుంగిపోయినట్లు నిపుణులు తేల్చారు. 75 ఏళ్ళు అత్యంత పటిష్టంగా ఉండాల్సిన బ్యారేజి నాలుగేళ్ళకే నాసిరకంగా తయారైందంటే అందుకు నిర్మాణ సంస్ధతో పాటు అప్పటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నిపుణులు తేల్చారట. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టు ఇన్చార్జిలు కూడా బాధ్యత వహించాల్సిందే అని నిపుణులు తేల్చారు. సుమారు రు. 4 వేల కోట్లతో నిర్మించిన బ్యారేజి ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడ్డారట. ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వచేస్తే ఇంకెంత ప్రమాదం బయటపడుతుందో అని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. మొత్తంమీద వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందన్నది వాస్తవం.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

7 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

7 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

8 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

8 hours ago