Political News

చార్జీలు పెంచుకుంటూ పోతున్న జగన్…

కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నార. అసలే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోన్న ఏపీపై కరోనా రూపంలో పెను విపత్తు పిడుగులా పడడంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడింది.

అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో…మాత్రం జగన్ వెనుకడగుడు వేయడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ వేరే ఆదాయ మార్గాలను అన్వేషించారు. ఖజానా నింపుకునేందుకు మెజారిటీ ప్రజలు పెద్దగా పట్టించుకోని అంశాలో ధరలను పెంచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ బాదుడు మొదలు పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటితో పాటు సామాన్య ప్రజలపై భారం పడే ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్న జగన్….తాజాగా రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా సుమారు రూ. 400 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. టూవీలర్, ఫోర్ వీలర్ల లైఫ్ ట్యాక్స్ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2 రకాల శ్లాబుల్లో 1- 3 శాతం వరకు పన్ను పెంపు ఉండబోతోందట. ప్రస్తుతం 9.12 శాతంగా ఉన్న టూవీలర్, ఫోర్ వీలర్ లైఫ్ ట్యాక్స్‌ను 2010 తరువాత పెంచలేదు. టూ వీలర్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఖజానాకు రూ. 174 కోట్ల, ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా రూ. 140 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

గూడ్స్ వాహనాలకు వివిధ శ్లాబుల్లో 10-15 శాతం పెంపు ఉండబోతోందట. వివిధ వాహనాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా అదనంగా రూ. 30 కోట్లు ఖజానాకు చేరనున్నాయట. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఇలా కొన్ని ధరలను పెంచి వ్యూహాత్మకంగా ఆదాయం పెంచుకుంటున్న జగన్…కట్టె విరగకుండా….పాము చావకుండా ఖజానాను నింపుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహాలోనే ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

This post was last modified on September 5, 2020 5:56 pm

Share
Show comments
Published by
Satya
Tags: APJaganYSRCP

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago