ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకుడు, వివాద రహితుడు, గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల జాబితా మూడుకు చేరింది. ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్.. తనకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో పార్టీ కి గుడ్ బై చెప్పారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.
అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన నేరుగా జనసేనలో కి వెళ్తున్నట్టు ప్రకటనే చేశారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం కాకుండా.. నరసరావుపేట నుంచి బాలశౌరిని పోటీ చేయాలని పార్టీ కోరింది. ఈ నేపథ్యంలో బాలశౌరి పార్టీని వీడిపోయారు. ఇక, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఈయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది.
కానీ, తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని లావు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఈయనను వెయిటింగ్లో పెట్టింది. ఇంతలోనే.. లావు స్థానంలో కొత్తవారిని తీసుకువస్తున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నే తాజాగా లావు గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అనిశ్చితి ఏర్పడిందని.. ఇది మంచిది కాదని.. అందుకే తాను బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా తన నియోజకవర్గంలోకొత్తవారిని తీసుకువస్తున్నారన్న ప్రచారం జరుగుతోందని లావు అన్నారు. దీంతో ఇప్పటి వరకు తనకు అండగా ఉన్న కేడర్.. గందరగోళంలో చిక్కుకున్నారని.. వారి కోసమే తాను పార్టీకి రిజైన్ చేశానని వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతంఅనిశ్చితికి తాను కారణం కాదని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, లావుకే టికెట్ ఇవ్వాలని.. ఇక్కడి వైసీపీ ఎంపీలు.. చాలా మంది వైసీపీకి సూచించారు. కానీ, పార్టీ మాత్రం ఆయనను మార్చాలని పట్టుదలతో ఉండడం గమనార్హం.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…