జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఉన్నత స్థాయిలో చూడాలనేది కాపు సామాజిక వర్గం అభిలాష.. ఆశ కూడా. ఈ క్రమంలోనే కాపులు అంతా సంఘటితం కూడా అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు గత రెండు వారాలుగా కాపులు మౌనంగా ఉన్నారు. ఇంతకు ముందుకు.. ఇప్పటికి.. చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గతంలో పవన్ కోసం.. ఏమైనా చేసేందుకు రెడీ అన్న కొందరు నాయకులు ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.
ఒక్క యువత మాత్రమే పవన్ గురించి, జనసేన గురించి ఎక్కువగా చర్చిస్తోంది. అయితే.. వీరంతా ఎన్నికల సమయానికి పోలింగ్ బూతులకు వస్తారా? అనేది ప్రశ్న. అంతేకాదు..ఓటు వేస్తారా? అనేది కూడా మరోప్రశ్న. ఇలా..ఏవిధంగా చూసుకున్నా.. పవన్పై ఈ వర్గం నాయకులు, యువత ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా రాష్ట్రంలో మారిన, మారుతున్న రాజకీయ పరిణామాలతో కాపు సామాజిక వర్గం మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకప్పుడు పవన్ సీఎం కావాలని అనుకున్నవారంతా.. పవన్ను సీఎంగా చూడాలని భావించిన వారంతా కూడా.. ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీనిని బట్టి .. పవన్ ఆలోచనలను వారు సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారా? లేక.. పవన్ తమ దారిలోకే రావాలని భావిస్తున్నారా? అనేది చర్చగా మారింది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు.. చంద్రబాబు వంటి దార్శనికుడు కావాలని పవన్ ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్నారు.
అంటే.. దాదాపు సీఎం సీటును తాను త్యాగం చేస్తున్నానని పవన్ ఒప్పేసుకున్నారు. మరి ఈ త్యాగాన్ని పవన్ అభిమానులు కానీ, ఆయన పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు కానీ, అర్ధం చేసుకోలేక పోతున్నారా? అనేది ప్రశ్న. ఇదిలావుంటే..తనను సీఎంగా చూడాలని అభిమానులు పదే పదే కోరుతున్నా.. పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఆ స్థానాన్ని త్యాగం చేశారు. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనిని ఇప్పటికైనా కేడర్ అర్థం చేసుకోవాల్సి ఉంది. పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంది. లేకపోతే.. ఇరు పక్షాలు కూడా.. మరో ఐదేళ్ల పాటు ఎదురు చూపులకే పరిమితం కావాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 23, 2024 8:16 am
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…