రాజకీయాల్లో రామమందిరం చేరిపోయింది. త్వరలోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత అయో ధ్య రామమందిర ప్రతిష్టా పనులు.. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు.. పడిన కష్టం వంటివి ప్రత్యేకంగా చర్చనీయాంశం కానున్నాయి. మెజారిటీ హిందువులు ఉన్న భారత దేశంలో వారి సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా.. ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ వ్యూహం. అందుకే.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం.. అహరహం.. ప్రధాని మోడీ దీనిని పర్యవేక్షించడం వంటివి జరిగాయి.
అయితే.. ఇలా అయోధ్యను రాజకీయాల్లో వాడుకోవడం.. ఎన్నికల్లో లబ్ధి పొందడం అనేది ఇప్పుడు కొత్తకాదు. 1990లలోనే అయోధ్య రాజకీయ వస్తువుగా మారిపోయింది. అప్పట్లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి లాల్ కిషన్ అద్వానీ.. దీనిని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతి హిందువు ఇంటిపై జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. అయోధ్య రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అరెస్టులు.. లాఠీ చార్జీలకు సైతం వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.
అనుకున్నట్టుగానే రథ యాత్ర చేశారు. ఇది కాస్తా.. ఎన్నికల యాత్రగా మారి.. 1990లలోనే బీజేపీ అధికా రంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించింది. 547 మంది సభ్యులు ఉన్న భారత పార్లమెంటులో అప్పటి వరకు కేవలం బిక్కుబిక్కు మంటూ ఇద్దరు సభ్యులతో ఉన్న బీజేపీ.. అనూహ్యంగా 303 స్థానాల్లో విజయం దక్కించుకుని తిరుగులేని అధికారాన్ని చేపట్టింది. దీనికి ప్రధాన కారణం.. ప్రధాన సాక్షి.. రామ మందిర మే! ఈ విషయాన్ని అద్వానీ పలు సందర్భాల్లోనూ వెల్లడించారు.
ఇక, ఇప్పుడు పరిస్థితి దానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. పైగా మరింత లక్ష్యం ఏర్పాటు చేసుకుని బీజేపీ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ఇప్పుడు దేశాన్ని,రాష్ట్రాలను రామనామ జపంలో ముంచేయడంలో ప్రధాని నరేంద్రమోడీ పూర్తిగా సక్సెస్ అయ్యారనడంలో సందేశం లేదు. ఇక, వచ్చే రెండు మాసాల్లో.. జరగనున్న ఎన్నికల్లో ఈ అయోధ్య రామమందిరం తమకు 400 సీట్లకు పైగానే తీసుకువస్తుందని మోడీ అంచనా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 2014 నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న మోడీకి ఇప్పుడు అయోధ్య రామమందిరం రూపంలో మూడో సారి కూడా విజయం దక్కడం ఖాయమనే అంచనాలు వస్తుండడం గమనార్హం. మొత్తానికి రామ మందిరం సాక్షిగా.. నాడు 300 ల సీట్లు వస్తే.. నేడు 400లకుపైగా టార్గెట్ పెట్టుకోవడం మరింత విశేషం!!
This post was last modified on January 22, 2024 10:45 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…