కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలకు భారీ ఎత్తున బాధ్యతలు ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావడం ఒక ఎత్తయితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పార్టీ సీనియర్లను తిరిగి పార్టికి సానుకూలంగా మార్చాల్సి న అవసరం ఉంది. దీంతో పాటు.. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి కడప పైనా షర్మిల ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ.. వారంతా తమ తమ మార్గాల్లో వేర్వేరుగా ఉంటున్నారు. కొందరు ఇతర పార్టీల్లో యాక్టివ్గా ఉంటే.. మరికొందరు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకీ కాకుండా.. ఉన్నవారు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే..వీరిని పార్టీవైపు మళ్లించే బాధ్యత షర్మి లపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వైఎస్ కంచుకోట వంటి కడప జిల్లాలో ఆమె ఎలా వ్యవహరిస్తారు? కీలక నేతలను పార్టీకి అనుకూలంగా ఎలా మారుస్తారు? అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ అభిమానులే కాకుండా.. కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కువగా నే ఉన్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి వంటి వారితోపాటు.. ప్రస్తుతం టీడీపీలోను, వైసీపీలోనూ ఉన్న నాయకులు ఉన్నారు. వీరంతా కూడా వైఎస్కే కాకుండా.. కాంగ్రెస్కు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని కాంగ్రెస్ వైపు తీసుకురావాల్సిన అవసరం షర్మిలపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆమె ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారనేద కీలకం.
ఇక, మరోముఖ్య విషయం.. కడపలో ఓటు బ్యాంకు. ఒకప్పుడు నాయకులతో సంబంధం లేకుండా.. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సమష్టి ఓటు బ్యాంకు ఉండేది. నాయకులు ఎవరైనా సరే.. పార్టీ పరంగా దూకుడు ప్రదర్శించినా.. అంతమంగా ప్రజలు పార్టీనే చూసేవారు. వ్యక్తిగతం కంటే పార్టీ కి ప్లస్గా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు దఖలు పడింది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకును ఎలా తనవైపు తిప్పుకుంటారనేది షర్మిల వ్యూహానికి పదునైన పరీక్షగానే మారుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 22, 2024 10:22 am
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…
ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…