సమీక్షలు జరిగేకొద్దీ ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడి బయటపడుతోందా ? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా బయటపడుతున్న దోపిడీని చూసి మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఉన్నతాదికారులు చెప్పిన సమాధానాలు విని మంత్రులు ఆశ్చర్యపోయారు.
జిల్లాలోని రెండు ప్రాజెక్టల్లోనే కేసీయార్ హయాంలో రు. 20 వేల కోట్ల దోపిడి జరిగిందని మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు రు. 9 వేల కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరంకు కూడా ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇరిగేషన్లో ప్రాజెక్టుల కోసం కేసీయార్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే రు. 18 వేలు కట్టాలని చెప్పారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరిగిందన్నారు.
దోపిడీ చేయటానికే కేసీయార్ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టినట్లుందని అనుమానం కూడా వ్యక్తంచేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రు. 86 వేల కోట్లలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు మంత్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాసిరకం నాణ్యత బయటపడింది. రు. 1681 కోట్లతో పూర్తయిపోయే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో కేసీయార్ ప్రభుత్వం రు.18,500 కోట్లకు పెంచినట్లు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని ప్రభుత్వం హైకోర్టు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాసింది. తాజా పరిణామాల్లో సిట్టింగ్ జడ్జి విచారణను కాళేశ్వరంకు మాత్రమే పరిమితం చేస్తుందా లేకపోతే హోలు మొత్తంమీద ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ వర్తింపచేస్తుందా అన్నది అర్ధంకావటంలేదు.
This post was last modified on January 21, 2024 12:59 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…