సమీక్షలు జరిగేకొద్దీ ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడి బయటపడుతోందా ? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా బయటపడుతున్న దోపిడీని చూసి మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఉన్నతాదికారులు చెప్పిన సమాధానాలు విని మంత్రులు ఆశ్చర్యపోయారు.
జిల్లాలోని రెండు ప్రాజెక్టల్లోనే కేసీయార్ హయాంలో రు. 20 వేల కోట్ల దోపిడి జరిగిందని మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు రు. 9 వేల కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరంకు కూడా ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇరిగేషన్లో ప్రాజెక్టుల కోసం కేసీయార్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే రు. 18 వేలు కట్టాలని చెప్పారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరిగిందన్నారు.
దోపిడీ చేయటానికే కేసీయార్ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టినట్లుందని అనుమానం కూడా వ్యక్తంచేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రు. 86 వేల కోట్లలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు మంత్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాసిరకం నాణ్యత బయటపడింది. రు. 1681 కోట్లతో పూర్తయిపోయే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో కేసీయార్ ప్రభుత్వం రు.18,500 కోట్లకు పెంచినట్లు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని ప్రభుత్వం హైకోర్టు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాసింది. తాజా పరిణామాల్లో సిట్టింగ్ జడ్జి విచారణను కాళేశ్వరంకు మాత్రమే పరిమితం చేస్తుందా లేకపోతే హోలు మొత్తంమీద ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ వర్తింపచేస్తుందా అన్నది అర్ధంకావటంలేదు.
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…