Political News

అయోధ్యలో హోటల్ రూం జస్ట్ రూ.లక్షేనట

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల నాటి కల. ఇప్పుడు సాకారం అవుతున్న వేళ.. యావత్ దేశం ఒకలాంటి భావోద్వేగంతో నిండి ఉంది. అయోధ్యలో రామాలయ స్వప్నం తీరటం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకువీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే.

మరికొద్ది గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తో సహా అతిరధ మహారథులు ఎందరో ఈ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకోవటానికి పెద్ద ఎత్తున భక్తజనం అయోధ్యకు వెళ్లేందుకు రెఢీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జనవరి 22న (సోమవారం) ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున అయోధ్యకు ఆహ్వానం అందుకున్న వారికి మాత్రమే అనుమతించే విషయాన్ని స్పష్టం చేయటం తెలిసిందే. టూరిజం భారీగా పెరగనున్న వేళ.. అయోధ్యలో హోటల్ రూం గదుల ధరలు భారీగా పెరిగిపోయాయి.

పలు స్టార్ హోటళ్లలో రోజుకు రూ.లక్ష ఛార్జ్ చేసే వరకు ధరలు వెళ్లాయి. గతంతో పోలిస్తే ఈ నెల 20-25 మధ్యన హోటల్ అద్దెలు ఐదు రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. పార్క్ ఇన్ రాడిసన్ హోటల్ టాప్ రూం ధర రూ.లక్ష మార్క్ దాటినట్లుగా చెబుతున్నారు. పార్క్ ఇన్ హోటల్ లోనూ ఇదే పరిస్థితని చెబుతున్నారు. అయోధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్ అయ్యాయని.. దీంతో అయోధ్యకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటళ్లకు సైతం గిరాకీ భారీగా పెరిగిపోయింది.

పలువురు హోం స్టేల వైపు చూస్తున్నారు. రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్ గదుల ధరలు రూ.7వేల నుంచి రూ.25వేలకు పెరిగినట్లుగా చెబుతున్నారు. డిమాండ్ భారీగా ఉండటంతో హోం స్టేలు సైతం అందుబాటులోకి వచ్చినట్ుల చెబుతున్నారు. వీటిల్లో మాత్రం రూం ధరలు రూ.4వేలకే మంచి డీల్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

This post was last modified on January 21, 2024 12:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

5 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago