Political News

దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లేనా ?

మూడు రోజుల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పూర్తయ్యింది. అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశాలు ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఆ సమావేశాలకే రేవంత్ తన బృందంతో హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం తన పర్యటనలో ప్రభుత్వం తరపున రేవంత్ రు. 40,232 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇపుడు జరిగిన ఎంవోయూలే అత్యధిక ఒప్పందాలని చెప్పుకోవాలి. పదేళ్ళల్లో తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రిగా కేటీయార్ దావోస్ వెళ్ళినా ఇంత పెద్దఎత్తున ఎంవోయూలు జరగలేదు.

200 కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం అనేక భేటీలు జరిపింది. దాని ఫలితమే పై ఒప్పందాలు. ఎంవోయూలు చేసుకున్న కంపెనీల్లో ఎక్కువగా ఇండియన్ కంపెనీలు ఉన్నాయిన వీటిల్లో కూడా అదాని గ్రూపు రు. 12,400 కోట్లు, జిందాల్ స్టీల్స్ రు. 9 వేల కోట్లు, గోడి ఇండియా రు. 8 వేల కోట్లు, వెబ్ వర్క్స్ రు. 5200 కోట్లు, అరెజాన్ లైఫ్ సైన్సెస్ రు. 2 వేల కోట్లు, గోద్రెజ్ రు. 1270 కోట్లు, టాటా గ్రూప్ రు. 1500 కోట్లు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ రు. 231 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి.

ఎంవోయులు చేసుకోవటం వరకు ఘనంగానే కనిపిస్తున్నాయి. ఈ ఘనమంతా ప్రచారం చేసుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. వాస్తవ రూపం దాల్చితేనే రాష్ట్రానికి ఉపయోగం అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంవోయులు చేసుకునే కంపెనీలన్నీ తర్వాత పెట్టుబడులపై ఆసక్తిని చూపించవు. ఏవో ప్రచారం కోసం కంపెనీలు హడావుడి చేస్తాయి. ఎంవోయులన్నీ వాస్తవరూపం దాల్చవన్న విషయం ప్రభుత్వానికి కంపెనీలకు కూడా బాగా తెలుసు.

ఎంవోయూలన్నీ వాస్తవరూపం దాల్చాలంటే అందుకు ఇటు ప్రభుత్వం అటు కంపెనీల్లో చిత్తశుద్ది అవసరం. ఎంవోయులు కుదుర్చుకున్న కంపెనీలతో ప్రభుత్వం వైపు నుండి ఫాలోప్ చాలా అవసరం. నిరంతరం కంపెనీల వెంటపడుతుంటే అప్పుడు యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే విషయమై సీరియస్ గా ఆలోచిస్తాయి. లేకపోతే ఎంవోయుల ప్రచారం ఉత్త ప్రచారంగా మాత్రమే ఉండిపోతాయి.

This post was last modified on January 20, 2024 10:50 am

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago