ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. తాను త్వరలోనే జనసేనలో చేరనున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రెండు పార్లమెంటు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబందించి ఆయన ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అదేసమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా తీసుకునేందుకు తాను సిద్ధమేనని వెల్లడించారు.
ఈ పరిణామం.. వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పుడు కాంగ్రెస్కు నేతృత్వం వహించిన కొణతాల రామకృష్ణ.. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. పార్టీని అన్ని విధాలా డెవలప్ చేశారు. తర్వాత.. టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ మరింత ఎక్కువగా ఆయన పాటుపడ్డారనే చెప్పాలి. బలమైన కేడర్ను సిద్ధం చేయడంతోపాటు.. టీడీపీ నిలదొక్కుకునే వ్యూహాలతో ముందుకు సాగారు. ఫలితంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ చాలా బలంగా ఎదిగింది.
అయితే.. టీడీపీతో విభేదించిన కొణతాల.. వైసీపీలోనూ పనిచేశారు. అయితే, జగన్కు ఆయనకు సరిపడక.. బయటకు వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు మరోసారి కూడా.. పార్టీలో చేరాలని అనుకు న్నా.. “జగన్లో మార్పు రాలేదు” అంటూ.. మరోసారి బయటకు వచ్చారు. తాజాగా జనసేనతో కలిసారు. రేపోమాపో ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే టీడీపీ-జనసేన మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో కొణతాల రాజకీయం నల్లేరుపైనడకే అన్నట్టుగా సాగనుంది.
ఫలితంగా.. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి కొన్నాళ్లుగా వైసీపీ ఉత్తరాంధ్రపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. బొత్స సత్యనారాయణ సహా వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి జిల్లాల బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే.. నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న కొణతాల ఎంట్రీతో ఈ ప్రయోగాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమంతో జిల్లాల్లో ఉన్న సమస్యలపై సుదీర్ఘ కాలంగా కొణతాల ఉద్యమించారు. ఇది ఆయన ప్లస్కానుంది. ఆయన ఎటు వుంటే.. అటు.. ప్రజలు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామమే వైసీపీలో కలవరం పుట్టిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 20, 2024 8:46 am
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…