Political News

ఉత్త‌రాంధ్ర వైసీపీలో క‌ల‌క‌లం.. కీల‌క నేత రీ ఎంట్రీ!

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ట్టున్న నాయ‌కుడు, మాజీ మంత్రి కొణతాల రామ‌కృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను త్వ‌ర‌లోనే జ‌న‌సేనలో చేర‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న జ‌నసేన అధినేత ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెండు పార్ల‌మెంటు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబందించి ఆయ‌న ముందు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. అదేస‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకునేందుకు తాను సిద్ధ‌మేన‌ని వెల్ల‌డించారు.

ఈ ప‌రిణామం.. వైసీపీని క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఒక‌ప్పుడు కాంగ్రెస్కు నేతృత్వం వ‌హించిన కొణతాల రామ‌కృష్ణ‌.. ఆ పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. పార్టీని అన్ని విధాలా డెవ‌ల‌ప్ చేశారు. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ మ‌రింత ఎక్కువ‌గా ఆయ‌న పాటుప‌డ్డార‌నే చెప్పాలి. బ‌లమైన కేడ‌ర్‌ను సిద్ధం చేయ‌డంతోపాటు.. టీడీపీ నిల‌దొక్కుకునే వ్యూహాల‌తో ముందుకు సాగారు. ఫ‌లితంగా కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ చాలా బ‌లంగా ఎదిగింది.

అయితే.. టీడీపీతో విభేదించిన కొణ‌తాల‌.. వైసీపీలోనూ ప‌నిచేశారు. అయితే, జ‌గ‌న్‌కు ఆయ‌న‌కు స‌రిపడ‌క‌.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి కూడా.. పార్టీలో చేరాల‌ని అనుకు న్నా.. “జ‌గ‌న్‌లో మార్పు రాలేదు” అంటూ.. మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాజాగా జ‌న‌సేన‌తో క‌లిసారు. రేపోమాపో ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, ఇప్ప‌టికే టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో కొణ‌తాల రాజ‌కీయం న‌ల్లేరుపైన‌డ‌కే అన్న‌ట్టుగా సాగ‌నుంది.

ఫ‌లితంగా.. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోనూ వైసీపీకి ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి కొన్నాళ్లుగా వైసీపీ ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బొత్స సత్య‌నారాయ‌ణ స‌హా వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి జిల్లాల బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించింది. అయితే.. నిన్న మొన్న‌టి వ‌రకు మౌనంగా ఉన్న కొణ‌తాల ఎంట్రీతో ఈ ప్ర‌యోగాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే అవ‌కాశం ఉంది. ఉత్త‌రాంధ్ర ఉద్య‌మంతో జిల్లాల్లో ఉన్న స‌మస్య‌ల‌పై సుదీర్ఘ కాలంగా కొణ‌తాల ఉద్య‌మించారు. ఇది ఆయ‌న ప్ల‌స్‌కానుంది. ఆయ‌న ఎటు వుంటే.. అటు.. ప్ర‌జ‌లు మొగ్గు చూపే అవ‌కాశం కూడా ఉంది. ఈ ప‌రిణామ‌మే వైసీపీలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 20, 2024 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago