Political News

ఉత్త‌రాంధ్ర వైసీపీలో క‌ల‌క‌లం.. కీల‌క నేత రీ ఎంట్రీ!

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ట్టున్న నాయ‌కుడు, మాజీ మంత్రి కొణతాల రామ‌కృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను త్వ‌ర‌లోనే జ‌న‌సేనలో చేర‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న జ‌నసేన అధినేత ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెండు పార్ల‌మెంటు.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సంబందించి ఆయ‌న ముందు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. అదేస‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకునేందుకు తాను సిద్ధ‌మేన‌ని వెల్ల‌డించారు.

ఈ ప‌రిణామం.. వైసీపీని క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఒక‌ప్పుడు కాంగ్రెస్కు నేతృత్వం వ‌హించిన కొణతాల రామ‌కృష్ణ‌.. ఆ పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. పార్టీని అన్ని విధాలా డెవ‌ల‌ప్ చేశారు. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ మ‌రింత ఎక్కువ‌గా ఆయ‌న పాటుప‌డ్డార‌నే చెప్పాలి. బ‌లమైన కేడ‌ర్‌ను సిద్ధం చేయ‌డంతోపాటు.. టీడీపీ నిల‌దొక్కుకునే వ్యూహాల‌తో ముందుకు సాగారు. ఫ‌లితంగా కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ చాలా బ‌లంగా ఎదిగింది.

అయితే.. టీడీపీతో విభేదించిన కొణ‌తాల‌.. వైసీపీలోనూ ప‌నిచేశారు. అయితే, జ‌గ‌న్‌కు ఆయ‌న‌కు స‌రిపడ‌క‌.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి కూడా.. పార్టీలో చేరాల‌ని అనుకు న్నా.. “జ‌గ‌న్‌లో మార్పు రాలేదు” అంటూ.. మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాజాగా జ‌న‌సేన‌తో క‌లిసారు. రేపోమాపో ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, ఇప్ప‌టికే టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో కొణ‌తాల రాజ‌కీయం న‌ల్లేరుపైన‌డ‌కే అన్న‌ట్టుగా సాగ‌నుంది.

ఫ‌లితంగా.. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోనూ వైసీపీకి ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి కొన్నాళ్లుగా వైసీపీ ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బొత్స సత్య‌నారాయ‌ణ స‌హా వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి జిల్లాల బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించింది. అయితే.. నిన్న మొన్న‌టి వ‌రకు మౌనంగా ఉన్న కొణ‌తాల ఎంట్రీతో ఈ ప్ర‌యోగాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే అవ‌కాశం ఉంది. ఉత్త‌రాంధ్ర ఉద్య‌మంతో జిల్లాల్లో ఉన్న స‌మస్య‌ల‌పై సుదీర్ఘ కాలంగా కొణ‌తాల ఉద్య‌మించారు. ఇది ఆయ‌న ప్ల‌స్‌కానుంది. ఆయ‌న ఎటు వుంటే.. అటు.. ప్ర‌జ‌లు మొగ్గు చూపే అవ‌కాశం కూడా ఉంది. ఈ ప‌రిణామ‌మే వైసీపీలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 20, 2024 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago