ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి (ప్రస్తుతం కోనసీమ జిల్లా) చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్రకటించారు. తనతోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబలిజ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు. వాస్తవానికి శెట్టిబలిజ సామాజిక వర్గం కోనసీమలో బలమైన పాత్ర పోషిస్తోంది.
దాదాపు 40 వేల నుంచి 50 వేల మధ్య ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో ఒక తెగగా ఉన్నారు. ఇక, వాసంశెట్టి సుభాష్.. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజిక వర్గం ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే.. జిల్లా పేరు మార్పు నుంచి(కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ) ఆయన పార్టీతో విభేదిస్తున్నారు.
అంతేకాదు.. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన భారీ ఆందోళనలు, నిరసనల్లో ఈ సామాజిక వర్గం పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం ఆయా కేసులను ఎత్తివేసింది. అయినప్పటికీ.. స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు.. తమతో కలివిడిగా ఉండడం లేదని.. కులాలమధ్య చిచ్చు పెడుతున్నారని.. దీనిని నివారించేందుకు అలాంటి నాయకులకు టికెట్ ఇవ్వరాదని.. కొన్నాళ్లుగా వాసంశెట్టి డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డికి వివరించారు. అయినా.. ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్ను పట్టించుకోలేదన్నది వాసంశెట్టి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇక, పార్టీలో ఇమడలేక.. బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎఫెక్ట్తో సుమారు 40 వేల నుంచి 50 వేల శెట్టిబలిజ ఓట్లు వైసీపీకి దూరమవుతాయనే అంచనా ఉంది. వీరంతా ఒకే మాటపై ఉంటారని తెలిసిందే. త్వరలోనే వాసంశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు.
This post was last modified on January 20, 2024 8:24 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…