ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి (ప్రస్తుతం కోనసీమ జిల్లా) చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్రకటించారు. తనతోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబలిజ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు. వాస్తవానికి శెట్టిబలిజ సామాజిక వర్గం కోనసీమలో బలమైన పాత్ర పోషిస్తోంది.
దాదాపు 40 వేల నుంచి 50 వేల మధ్య ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో ఒక తెగగా ఉన్నారు. ఇక, వాసంశెట్టి సుభాష్.. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజిక వర్గం ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే.. జిల్లా పేరు మార్పు నుంచి(కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ) ఆయన పార్టీతో విభేదిస్తున్నారు.
అంతేకాదు.. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన భారీ ఆందోళనలు, నిరసనల్లో ఈ సామాజిక వర్గం పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం ఆయా కేసులను ఎత్తివేసింది. అయినప్పటికీ.. స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు.. తమతో కలివిడిగా ఉండడం లేదని.. కులాలమధ్య చిచ్చు పెడుతున్నారని.. దీనిని నివారించేందుకు అలాంటి నాయకులకు టికెట్ ఇవ్వరాదని.. కొన్నాళ్లుగా వాసంశెట్టి డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డికి వివరించారు. అయినా.. ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్ను పట్టించుకోలేదన్నది వాసంశెట్టి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇక, పార్టీలో ఇమడలేక.. బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎఫెక్ట్తో సుమారు 40 వేల నుంచి 50 వేల శెట్టిబలిజ ఓట్లు వైసీపీకి దూరమవుతాయనే అంచనా ఉంది. వీరంతా ఒకే మాటపై ఉంటారని తెలిసిందే. త్వరలోనే వాసంశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు.
This post was last modified on January 20, 2024 8:24 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…