Political News

వైసీపీకి భారీ షాక్‌: కోన‌సీమలో 40 వేల ఓట్లకు గండి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ ప్రాంతానికి (ప్ర‌స్తుతం కోన‌సీమ జిల్లా) చెందిన శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్ర‌క‌టించారు. త‌న‌తోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబ‌లిజ నాయ‌కులు ఆ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌స్తార‌ని ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం కోన‌సీమ‌లో బ‌ల‌మైన పాత్ర పోషిస్తోంది.

దాదాపు 40 వేల నుంచి 50 వేల మ‌ధ్య ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గం కాపు సామాజిక వ‌ర్గంలో ఒక తెగ‌గా ఉన్నారు. ఇక‌, వాసంశెట్టి సుభాష్‌.. శెట్టిబ‌లిజ యాక్ష‌న్ ఫోర్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌యోజ‌నాల‌కు అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయ‌న వైసీపీలోనే ఉన్నారు. అయితే.. జిల్లా పేరు మార్పు నుంచి(కోనసీమ జిల్లాను డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మారుస్తూ) ఆయ‌న పార్టీతో విభేదిస్తున్నారు.

అంతేకాదు.. జిల్లా పేరు మార్పు విష‌యంలో జ‌రిగిన భారీ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల్లో ఈ సామాజిక వ‌ర్గం పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఆయా కేసుల‌ను ఎత్తివేసింది. అయిన‌ప్ప‌టికీ.. స్థానికంగా ఉన్న రాజ‌కీయ నేత‌లు.. త‌మ‌తో క‌లివిడిగా ఉండ‌డం లేద‌ని.. కులాల‌మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని.. దీనిని నివారించేందుకు అలాంటి నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వరాద‌ని.. కొన్నాళ్లుగా వాసంశెట్టి డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌రామ‌కృష్ణారెడ్డికి వివ‌రించారు. అయినా.. ప్ర‌భుత్వం మాత్రం వీరి డిమాండ్‌ను ప‌ట్టించుకోలేద‌న్న‌ది వాసంశెట్టి ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలోనే ఇక‌, పార్టీలో ఇమ‌డ‌లేక‌.. బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ ఎఫెక్ట్‌తో సుమారు 40 వేల నుంచి 50 వేల శెట్టిబ‌లిజ ఓట్లు వైసీపీకి దూర‌మ‌వుతాయ‌నే అంచ‌నా ఉంది. వీరంతా ఒకే మాట‌పై ఉంటార‌ని తెలిసిందే. త్వ‌ర‌లోనే వాసంశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటాన‌ని చెప్పారు.

This post was last modified on January 20, 2024 8:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago