Political News

చంద్ర‌బాబు అదిరిపోయే హ‌మీ.. జ‌నాలు ఫిదా!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న హామీ ఇచ్చారు. నిజానికి ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో రూపంలో ఆరు గ్యారెంటీల‌ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. పూర్తిస్థాయిలో హామీల విష‌యంలో ఇంకా ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు. వీటిలో తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు క‌రెంటు చార్జీల‌ను పెంచేది లేద‌ని.. పెంచ‌బోమ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను మ‌రో 50 యూనిట్ల‌కు పెంచ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ రెండు హామీలు కూడా.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికి 4 ద‌ఫాలుగా విద్యుత్ చార్జీల‌ను పెంచింది. ఎస్సీ, ఎస్టీల‌కు 200 యూనిట్ల విద్య‌త్‌ను అమ‌లు చేస్తోంది.

అయితే.. వీటిలోనూ ట్యాక్సులు క‌డుతున్నార‌న్న మిషతో.. చాలా క‌నెక్ష‌న్ల‌కు ఉచిత విద్య‌త్ సౌక‌ర్యాన్ని తీసివేసింది. దీంతో ఆయా వ‌ర్గాలు సాధార‌ణ జ‌నాల మాదిరిగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజా ప్ర‌క‌ట‌న ఆయా వ‌ర్గాల‌కు ఉప‌శ‌మ‌నంగా మార‌నుంది. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు .. చార్జీలు పెంచ‌బోమ‌న్న హామీ మ‌రింత ఆనందం క‌లిగించ‌నుంది. ఇక‌, మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసును అందుబాటులోకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on January 20, 2024 8:20 am

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

5 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

6 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

6 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

7 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

7 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

7 hours ago