Political News

చంద్ర‌బాబు అదిరిపోయే హ‌మీ.. జ‌నాలు ఫిదా!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న హామీ ఇచ్చారు. నిజానికి ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో రూపంలో ఆరు గ్యారెంటీల‌ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. పూర్తిస్థాయిలో హామీల విష‌యంలో ఇంకా ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు. వీటిలో తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు క‌రెంటు చార్జీల‌ను పెంచేది లేద‌ని.. పెంచ‌బోమ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను మ‌రో 50 యూనిట్ల‌కు పెంచ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ రెండు హామీలు కూడా.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికి 4 ద‌ఫాలుగా విద్యుత్ చార్జీల‌ను పెంచింది. ఎస్సీ, ఎస్టీల‌కు 200 యూనిట్ల విద్య‌త్‌ను అమ‌లు చేస్తోంది.

అయితే.. వీటిలోనూ ట్యాక్సులు క‌డుతున్నార‌న్న మిషతో.. చాలా క‌నెక్ష‌న్ల‌కు ఉచిత విద్య‌త్ సౌక‌ర్యాన్ని తీసివేసింది. దీంతో ఆయా వ‌ర్గాలు సాధార‌ణ జ‌నాల మాదిరిగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజా ప్ర‌క‌ట‌న ఆయా వ‌ర్గాల‌కు ఉప‌శ‌మ‌నంగా మార‌నుంది. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు .. చార్జీలు పెంచ‌బోమ‌న్న హామీ మ‌రింత ఆనందం క‌లిగించ‌నుంది. ఇక‌, మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసును అందుబాటులోకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on January 20, 2024 8:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

34 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

49 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago