Political News

మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద‌.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్య‌లో ఇళ్ల‌ను ప్రారంభించారు. అధునాత‌న సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వ‌స‌తుల‌తో నిర్మించిన ఈ భ‌వ‌నాలు.. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల‌లో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంత‌రం.. మోడీ ప్ర‌సంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్ట‌వంతులు. అన్ని వ‌స‌తులు.. సౌక‌ర్యాలు, అధునాత‌న నిర్మాణాల‌తో కూడిన ఇళ్ల‌ను సొంతం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో త‌న బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్న‌ప్పుడు ఇలాంటి ఇళ్ల‌లో ఉండే అవ‌కాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అంద‌రం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్క‌సారిగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌నే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెక‌న్ల‌పాటు త‌న ప్ర‌సంగాన్ని ఆపేశారు. అనంత‌రం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గ‌ద స్వరంతోనే ఆయ‌న మాట్లాడారు. నేడు త‌మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు అధునాతన ఇళ్ల‌ను నిర్మించి ఇస్తోంద‌ని చెప్పారు.

పేద‌ల‌కు మేలు చేయాల‌న్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆద‌ర్శంగా తీసుకుని త‌మ ప్ర‌భుత్వం నిజాయితీగా ప‌నిచేస్తోంద‌ని మోడీ చెప్పారు. ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న అయోధ్య రాముని ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో శ్రీరామ జ్యోతిని వెలిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ రాముడు చూపిన బాట‌లో న‌డ‌వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్ల‌డించారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago