ఎప్పుడూ గంభీరంగా కనిపించే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే.. కన్నీళ్లను ఆపుకుని.. గద్గద స్వరంతో ఆయన ప్రసంగించారు. దీనికి కారణం.. చిన్ననాటి సంగతులు.. తమ కుటుంబం కష్టాలు ఆయన కళ్లముందు కదలాడడమే. గుర్తుకు రావడమే. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని షోలాపూర్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వసతులతో నిర్మించిన ఈ భవనాలు.. దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంతరం.. మోడీ ప్రసంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్టవంతులు. అన్ని వసతులు.. సౌకర్యాలు, అధునాతన నిర్మాణాలతో కూడిన ఇళ్లను సొంతం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్నప్పుడు ఇలాంటి ఇళ్లలో ఉండే అవకాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అందరం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెకన్లపాటు తన ప్రసంగాన్ని ఆపేశారు. అనంతరం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గద స్వరంతోనే ఆయన మాట్లాడారు. నేడు తమ ప్రభుత్వం పేదలకు అధునాతన ఇళ్లను నిర్మించి ఇస్తోందని చెప్పారు.
పేదలకు మేలు చేయాలన్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోడీ చెప్పారు. ఈ నెల 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్టా కార్యక్రమాన్నిపురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు.
This post was last modified on January 19, 2024 5:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…