Political News

మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద‌.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్య‌లో ఇళ్ల‌ను ప్రారంభించారు. అధునాత‌న సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వ‌స‌తుల‌తో నిర్మించిన ఈ భ‌వ‌నాలు.. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల‌లో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంత‌రం.. మోడీ ప్ర‌సంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్ట‌వంతులు. అన్ని వ‌స‌తులు.. సౌక‌ర్యాలు, అధునాత‌న నిర్మాణాల‌తో కూడిన ఇళ్ల‌ను సొంతం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో త‌న బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్న‌ప్పుడు ఇలాంటి ఇళ్ల‌లో ఉండే అవ‌కాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అంద‌రం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్క‌సారిగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌నే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెక‌న్ల‌పాటు త‌న ప్ర‌సంగాన్ని ఆపేశారు. అనంత‌రం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గ‌ద స్వరంతోనే ఆయ‌న మాట్లాడారు. నేడు త‌మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు అధునాతన ఇళ్ల‌ను నిర్మించి ఇస్తోంద‌ని చెప్పారు.

పేద‌ల‌కు మేలు చేయాల‌న్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆద‌ర్శంగా తీసుకుని త‌మ ప్ర‌భుత్వం నిజాయితీగా ప‌నిచేస్తోంద‌ని మోడీ చెప్పారు. ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న అయోధ్య రాముని ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో శ్రీరామ జ్యోతిని వెలిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ రాముడు చూపిన బాట‌లో న‌డ‌వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్ల‌డించారు.

This post was last modified on January 19, 2024 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago