Political News

మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద‌.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్య‌లో ఇళ్ల‌ను ప్రారంభించారు. అధునాత‌న సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వ‌స‌తుల‌తో నిర్మించిన ఈ భ‌వ‌నాలు.. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల‌లో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంత‌రం.. మోడీ ప్ర‌సంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్ట‌వంతులు. అన్ని వ‌స‌తులు.. సౌక‌ర్యాలు, అధునాత‌న నిర్మాణాల‌తో కూడిన ఇళ్ల‌ను సొంతం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

ఇదేస‌మ‌యంలో త‌న బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్న‌ప్పుడు ఇలాంటి ఇళ్ల‌లో ఉండే అవ‌కాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అంద‌రం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్క‌సారిగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌నే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెక‌న్ల‌పాటు త‌న ప్ర‌సంగాన్ని ఆపేశారు. అనంత‌రం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గ‌ద స్వరంతోనే ఆయ‌న మాట్లాడారు. నేడు త‌మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు అధునాతన ఇళ్ల‌ను నిర్మించి ఇస్తోంద‌ని చెప్పారు.

పేద‌ల‌కు మేలు చేయాల‌న్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆద‌ర్శంగా తీసుకుని త‌మ ప్ర‌భుత్వం నిజాయితీగా ప‌నిచేస్తోంద‌ని మోడీ చెప్పారు. ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న అయోధ్య రాముని ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో శ్రీరామ జ్యోతిని వెలిగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ రాముడు చూపిన బాట‌లో న‌డ‌వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్ల‌డించారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

22 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

54 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago