తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్ర మోర్చాలతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను మార్చేసింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన ఆరు మోర్చాలను కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మార్చేశారు. ఇపుడు మార్చిన వాళ్ళంతా చాలా కాలంగా పదవుల్లో ఉన్న వాళ్ళే. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నపుడు కిషన్ వీళ్ళని మార్చటంపై దృష్టిపెట్టలేదు.
ఎందుకంటే కిషన్ అధ్యక్షుడు అయ్యిందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కాబట్టి మిగిలిన వాళ్ళని మార్చే ఆలోచన చేయలేదు. ఇపుడు కిషన్ కుదురుకున్న కారణంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మార్పులు మొదలుపెట్టారు. ముందుగా ఎస్టీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్ నాయక్ ను, ఎస్సీ మోర్చాకు మాజీ ఎంఎల్ఏ కొండేటి శ్రీధర్, యువ మోర్చాకు సేవెల్ల మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చాకు డాక్టర్ శిల్పను కిషన్ రెడ్డి నియిమించారు.
అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కులాచారి దినేష్ కుమార్, పెద్దపల్లికి చందుపట్ల సునీల్, సంగారెడ్డికి గోదావరి, సిద్ధిపేటకు గంగడి మోహన్ రెడ్డి, యాదాద్రి, భువనగిరికి పాశం భాస్కర్, వనపర్తికి డీ నారాయణ, వికారాబాద్ కు మాధవరెడ్డి, నల్లగొండకు డాక్టర్ వర్షిత్ రెడ్డి, ములుగుకు బలరాం, మహబూబ్ నగర్ జిల్లాకు పీ శ్రీనివాసరెడ్డి, వరంగల్ కు గంటరవి, నారాయణపేట జిల్లాకు జలంధర్ రెడ్డిని కిషన్ నియమించారు.
బహుశా వీళ్ళంతా కొత్తవాళ్ళు కాబట్టి అందరు కిషన్ టీముగా చెలామణి అవుతారేమో. కొత్తవారికి అవకాశం ఇవ్వటం వల్ల అందరు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కష్టపడి పనిచేస్తారని కిషన్ అనుకున్నట్లున్నారు. జిల్లాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు ఎంత కష్టపడినా అభ్యర్ధులు గట్టివారయ్యుండాలని కిషన్ మరచిపోయినట్లున్నారు. అలాగే జనాల్లో పార్టీకి సానుకూలత ఉంటేనే అభ్యర్దులు గెలుస్తారని కిషన్ మరచిపోయారు. మరి కొత్త్ మోర్చా అధ్యక్షులు, జల్లాల అధ్యక్షులు ఏమేరకు కష్టపడతారో, ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
This post was last modified on January 19, 2024 2:57 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…