ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మూడు విడతలుగా వైసీపీ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్చార్జిల మార్పునకు సంబంధించి నాలుగో జాబితాను రెడీ చేశారు.
ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. నాలుగో జాబితాలో 9 నియోజకవర్గాల ఇన్చార్జిలను మారుస్తున్నట్లు బొత్స వెల్లడించారు. చిత్తూరు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నారాయణస్వామిని నియమించారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. ఇప్పటికే 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 9 పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను మూడు విడతలలో వైసిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ నాలుగో జాబితా తర్వాత ఎంతమంది నేతలు వైసీపీని వీడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం గుంటూరులో బాలశౌరి నివాసం ముందు ఆయన అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మచిలీపట్నం ఎంపీగా జనసేన తరఫున బాలశౌరి బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
వైసీపీ ఇన్చార్జిల నాలుగో జాబితా ఇదే…
చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి
జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
శింగనమల- ఎం వీరాంజనేయులు
తిరువూరు- స్వామిదాస్
మడకశిర -ఈర లక్కప్ప
కొవ్వూరు – తలారి వెంకట్రావ్
కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
గోపాలపురం – తానేటి వనిత
నందికొట్కూరు – డా. సుధీర్ దారా
This post was last modified on January 19, 2024 9:32 am
రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…