ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మూడు విడతలుగా వైసీపీ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్చార్జిల మార్పునకు సంబంధించి నాలుగో జాబితాను రెడీ చేశారు.
ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. నాలుగో జాబితాలో 9 నియోజకవర్గాల ఇన్చార్జిలను మారుస్తున్నట్లు బొత్స వెల్లడించారు. చిత్తూరు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నారాయణస్వామిని నియమించారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. ఇప్పటికే 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 9 పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను మూడు విడతలలో వైసిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ నాలుగో జాబితా తర్వాత ఎంతమంది నేతలు వైసీపీని వీడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం గుంటూరులో బాలశౌరి నివాసం ముందు ఆయన అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మచిలీపట్నం ఎంపీగా జనసేన తరఫున బాలశౌరి బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
వైసీపీ ఇన్చార్జిల నాలుగో జాబితా ఇదే…
చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి
జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
శింగనమల- ఎం వీరాంజనేయులు
తిరువూరు- స్వామిదాస్
మడకశిర -ఈర లక్కప్ప
కొవ్వూరు – తలారి వెంకట్రావ్
కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
గోపాలపురం – తానేటి వనిత
నందికొట్కూరు – డా. సుధీర్ దారా
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…