టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. గతంలో నిర్వహించిన సభల్లో ప్రకటించిన ‘పూర్ టు రిచ్’ కాన్సె ప్ట్ ను తాజాగా ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన జన్మభూమి.. నిమ్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ను చంద్రబాబు ఆవిష్కరిస్తూ.. దీని లక్ష్యాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి.. అధికారంలోకి వచ్చాక సమగ్రంగా అమలు చేస్తామన్నారు.
ప్రస్తుతం నిమ్మకూరు-నారా వారి పల్లెల్లో ఈ పూర్ టు రిచ్ కాన్సెప్టును ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలను వారి స్వగ్రామం లేదా.. స్వస్థలంలోనే ధనవంతులను చేసేలా ప్రోత్సహించడమే పూర్ టు రిచ్.. కార్యక్రమం ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి.. ఈ బాధ్యతలు తీసుకునేలా చేస్తామన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా.. నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న పేదలను అక్కడి వనరులను ఆధారంగా చేసుకుని.. ధనవంతులను చేయాలనే కాన్సెప్టును ఆయన ప్రకటించారు. ఇరు గ్రామాల్లోని వ్యవసాయ భూములను అంచనా వేసి.. ఎంత మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారో తెలుసుకుని.. వ్యవసాయానికి దూరంగా ఉన్న వలస పోయిన వారిని.. వెనక్కి తీసుకువచ్చి.. ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
ఉదాహరణకు ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. కేవలం ఇక్కడ 80 మంది రైతు కుటుంబాలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నాయని లెక్కలు వివరించారు. ఈ నేపథ్యంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ కింద.. ఇదే గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్తలు.. ఇప్పుడు ఈ గ్రామం బాధ్యతలను తీసుకుని.. వలస వెళ్లిన వారిని బాగు చేయడంతోపాటు.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవడానికి చేయూత అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. ఇదే పూర్ టు రిచ్ కాన్సెప్టని చంద్రబాబు వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. అన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తామన్నారు.
This post was last modified on January 18, 2024 8:06 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…