ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాయపాటి సాంబశివరావు.. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే.. టీడీపీకి కూడా ఆయన సానుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. విభేదించేవారు కాదు. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన.. కన్నా లక్ష్మీనారాయణతోనే వైరం ఉండేది తప్ప.. టీడీపీ నాయకులతో ఆయన ఎక్కడా విభేదించిన సందర్భాలు లేవు.
పైగా.. కాంగ్రెస్లో ఉన్నప్పుడే.. రాయపాటి.. టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారని అంటారు. ఈ క్రమంలోనే 2014 రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో ఆయన వెంటనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీచేసి విజయం దక్కించుకున్నారు. 2019లో రాయపాటి ఓడిపోతారని తెలిసి కూడా.. ఆయనపై ఉన్న అభిమానంతో చంద్రబాబు.. టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక మంది పోటీకి రెడీ అయినా.. పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడు ఇదే కుటుంబం చంద్రబాబు కేంద్రంగా రాజకీయ విమర్శలు చేస్తూ.. రచ్చకు దిగడం.. అందరినీ విస్మయానికి గురి చేసింది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ను రాయపాటి కుమారుడు రంగారావు ఆశించారన్నది నిజం. కానీ, ఇది దక్కలేదు. దీంతో ఈ కుటుంబం టీడీపీకి దూరమై.. వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రంగారావు బయటకు వచ్చి.. చంద్రబాబు, నారా లోకేష్లపై విమర్శలు గుప్పించారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో టీడీపీని సమర్థించిన రాయపాటి సోదరుడి కుమార్తె, అమరావతి జేఏసీ నాయకురాలు.. రాయపాటి శైలజపైనా అక్కసు వెళ్లగక్కారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా.. టీడీపీకి వచ్చే నష్టం కన్నా.. రాయపాటి కుటుంబంపై ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న మంచి పేరు, ఇమేజ్ వంటి ఖరాబ్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాయపాటి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా.. జిల్లాలో టీడీపీ వెలిగిందని.. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ టీడీపీ ఉందన్నట్టుగా వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు…