ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాయపాటి సాంబశివరావు.. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే.. టీడీపీకి కూడా ఆయన సానుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. విభేదించేవారు కాదు. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన.. కన్నా లక్ష్మీనారాయణతోనే వైరం ఉండేది తప్ప.. టీడీపీ నాయకులతో ఆయన ఎక్కడా విభేదించిన సందర్భాలు లేవు.
పైగా.. కాంగ్రెస్లో ఉన్నప్పుడే.. రాయపాటి.. టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారని అంటారు. ఈ క్రమంలోనే 2014 రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో ఆయన వెంటనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీచేసి విజయం దక్కించుకున్నారు. 2019లో రాయపాటి ఓడిపోతారని తెలిసి కూడా.. ఆయనపై ఉన్న అభిమానంతో చంద్రబాబు.. టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక మంది పోటీకి రెడీ అయినా.. పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడు ఇదే కుటుంబం చంద్రబాబు కేంద్రంగా రాజకీయ విమర్శలు చేస్తూ.. రచ్చకు దిగడం.. అందరినీ విస్మయానికి గురి చేసింది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ను రాయపాటి కుమారుడు రంగారావు ఆశించారన్నది నిజం. కానీ, ఇది దక్కలేదు. దీంతో ఈ కుటుంబం టీడీపీకి దూరమై.. వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రంగారావు బయటకు వచ్చి.. చంద్రబాబు, నారా లోకేష్లపై విమర్శలు గుప్పించారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో టీడీపీని సమర్థించిన రాయపాటి సోదరుడి కుమార్తె, అమరావతి జేఏసీ నాయకురాలు.. రాయపాటి శైలజపైనా అక్కసు వెళ్లగక్కారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా.. టీడీపీకి వచ్చే నష్టం కన్నా.. రాయపాటి కుటుంబంపై ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న మంచి పేరు, ఇమేజ్ వంటి ఖరాబ్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాయపాటి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా.. జిల్లాలో టీడీపీ వెలిగిందని.. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ టీడీపీ ఉందన్నట్టుగా వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 18, 2024 5:05 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…