విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ అక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసివేయాలని బాలకృష్ణ తన అనుచరులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో, అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కూడా తారక్, కళ్యాణ్ రామ్ లు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే నందమూరి, నారా కుటుంబాలతో ఆ ఇద్దరికి చాలాకాలంగా గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది.
అందుకే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే తీయించేయ్… అంటూ ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని బాలకృష్ణ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. బాలకృష్ణ చెప్పిన వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను బాలయ్య బాబు అనుచరులు తొలగించారు. యమదొంగ చిత్రంలో యమధర్మరాజు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోతో పాటు, అన్న నందమూరి తారక రామారావు ఫొటోను కలిపి ఫ్లెక్సీలు అభిమానులు వేయించారు. వాటిని తొలగిస్తున్న వీడియో వ్యవహారంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందన ఏవిధంగా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 18, 2024 1:37 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…