Political News

తారక్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య హుకుం!

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ అక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనం రేపుతోంది‌. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసివేయాలని బాలకృష్ణ తన అనుచరులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో, అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కూడా తారక్, కళ్యాణ్ రామ్ లు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే నందమూరి, నారా కుటుంబాలతో ఆ ఇద్దరికి చాలాకాలంగా గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది.

అందుకే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే తీయించేయ్… అంటూ ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని బాలకృష్ణ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. బాలకృష్ణ చెప్పిన వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను బాలయ్య బాబు అనుచరులు తొలగించారు. యమదొంగ చిత్రంలో యమధర్మరాజు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోతో పాటు, అన్న నందమూరి తారక రామారావు ఫొటోను కలిపి ఫ్లెక్సీలు అభిమానులు వేయించారు. వాటిని తొలగిస్తున్న వీడియో వ్యవహారంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందన ఏవిధంగా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 18, 2024 1:37 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

55 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago