ఎన్నికలకు ముందు.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక వికెట్ పడిపోయింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, విశాఖ పట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గం నేత సీతంరాజు సుధాకర్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. అయితే.. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ను ఆశించారు. కానీ, టీడీపీలో గత ఎన్నికల సమయంలో గెలిచిన వాసుపల్లి గణేశ్.. వైసీపీలోకి రావడంతో ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది.
దీంతో అలిగిన సీతంరాజు కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నా లు కూడా జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు.. పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ.. సీతంరాజు వినిపించుకోలేదు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనా మా ప్రకటించారు. అయితే.. సీతం రాజు ఎఫెక్ట్ పార్టీపై ఎంత ఉంటుంది? అనేది ఆసక్తిగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇప్పటికే టికెట్ లేకుండా పోయింది.
విజయవాడ సెంట్రల్ నియోకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాదికి ఈ దఫా టికెట్ లేకుండా చేశారు. ఇది బ్రాహ్మణ సామాజికవ ర్గంలో ఆగ్రహం తెప్పించింది.ఇ క, ఇప్పుడు ఇదే సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ను కూడా పక్కన పెట్టడం.. అసలు ఎమ్మెల్యే రేసులో లేకుండా చేయడం.. ఈ వర్గంలో ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు.. గత 2022లో జరిగిన స్థానిక ఎన్నికల్లో విశాఖలో టీడీపీ ఓటమికి సీతంరాజు బలంగా పనిచేశారు.
దీంతో వైసీపీ ఇక్కడి కార్పొరేషన్ను చేజిక్కించుకుంది. విశాఖ నగరం పరిధిలోనూ సీతంరాజుకు మంచి పేరుంది. దీంతో ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఆయనే స్వయంగా 12 మంది కార్పొరేటర్లను తన వెంట తీసుకువెళ్లానని అన్నారు. దీంతో విశాఖ కార్పొరేషన్ కూడా.. వైసీపీ నుంచి టీడీపీకి దక్కే చాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా.. చిన్న నేతేలే అని కొట్టిపారేసినా.. గట్టి దెబ్బే వేసేలా కనిపిస్తున్నాడని వైసీపీలోనే ఓ వర్గం అంటోంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…