ఎన్నికలకు ముందు.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక వికెట్ పడిపోయింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, విశాఖ పట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గం నేత సీతంరాజు సుధాకర్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. అయితే.. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ను ఆశించారు. కానీ, టీడీపీలో గత ఎన్నికల సమయంలో గెలిచిన వాసుపల్లి గణేశ్.. వైసీపీలోకి రావడంతో ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది.
దీంతో అలిగిన సీతంరాజు కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నా లు కూడా జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు.. పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ.. సీతంరాజు వినిపించుకోలేదు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనా మా ప్రకటించారు. అయితే.. సీతం రాజు ఎఫెక్ట్ పార్టీపై ఎంత ఉంటుంది? అనేది ఆసక్తిగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇప్పటికే టికెట్ లేకుండా పోయింది.
విజయవాడ సెంట్రల్ నియోకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాదికి ఈ దఫా టికెట్ లేకుండా చేశారు. ఇది బ్రాహ్మణ సామాజికవ ర్గంలో ఆగ్రహం తెప్పించింది.ఇ క, ఇప్పుడు ఇదే సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ను కూడా పక్కన పెట్టడం.. అసలు ఎమ్మెల్యే రేసులో లేకుండా చేయడం.. ఈ వర్గంలో ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు.. గత 2022లో జరిగిన స్థానిక ఎన్నికల్లో విశాఖలో టీడీపీ ఓటమికి సీతంరాజు బలంగా పనిచేశారు.
దీంతో వైసీపీ ఇక్కడి కార్పొరేషన్ను చేజిక్కించుకుంది. విశాఖ నగరం పరిధిలోనూ సీతంరాజుకు మంచి పేరుంది. దీంతో ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఆయనే స్వయంగా 12 మంది కార్పొరేటర్లను తన వెంట తీసుకువెళ్లానని అన్నారు. దీంతో విశాఖ కార్పొరేషన్ కూడా.. వైసీపీ నుంచి టీడీపీకి దక్కే చాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా.. చిన్న నేతేలే అని కొట్టిపారేసినా.. గట్టి దెబ్బే వేసేలా కనిపిస్తున్నాడని వైసీపీలోనే ఓ వర్గం అంటోంది.
This post was last modified on January 17, 2024 7:02 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…