Political News

బీఆర్ఎస్ అంత పని చేసిందా.. !

కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచకం మరోటి బయటపడినట్లు తెలుస్తోంది. అదేమిటంటే రిటైర్ అయిన ఉద్యోగులను రీ అపాయిట్మెంట్ చేయించి మళ్ళీ  అదే పోస్టుల్లో కొనసాగించటం.  వివిధ శాఖల్లోని ఇలాంటి రీ అపాయిట్మెంట్లు ఇపుడు బయటపడ్డాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులు సంబంధిత శాఖల వ్యవహారాల్లో  బాగా నిపుణులైతే వాళ్ళని సలహాదారులుగా తీసుకోవటం ఒక పద్ధతి. అయితే రిటైర్ అయినా సరే మళ్ళీ వాళ్ళనే రీ అపాయింట్ చేసి అదికారాలన్నీ వాళ్ళచేతుల్లోనే పెట్టడం అన్నది ఉండదు.

కానీ కేసీయార్ పదేళ్ళల్లో చాలామందిని ఇదే విధంగా రీ అపాయింట్ చేసినట్లు ఇపుడు వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఐదుగురు ఐఏఎస్ అధికారులు అదర్ సిన్హా, రాణి కుముదిని, ఉమర్ జలీల్, అర్వీందర్ సింగ్, అనిల్ రిటైర్ అయిపోయారు. అయితే తమకున్న పలుకుబడితో వీళ్ళంతా తాము  ఏ శాఖల్లో రిటైర్ అయ్యారో అదే శాఖల్లో రీ అపాయిట్మెంట్ తెచ్చుకుని అదే హోదాలో కంటిన్యూ అవుతున్నారు. ప్రిన్సిపుల్ సెక్రటరీగా రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలంటే సలహాదారుగా తీసుకుంటారు.

అంతేకానీ రిటైర్ అయిన ప్రిన్సిపుల్ సెక్రటరీ పోస్టునే రీ పోస్టింగ్ పేరుతో  ప్రభుత్వం ఇచ్చేందుకు లేదు. కానీ కేసీయార్ ఐదుగురు ఐఏఎస్ అధికారులకు అలాగే పోస్టింగ్ ఇచ్చేశారు. విచిత్రం ఏమిటంటే దీనికి సంబంధించిన ఫైల్ ప్రొసీడింగ్స్ ఎక్కడా కనబడటం లేదట. అంతా నోటి మాట ద్వారానే జరిగిపోయింది. ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖల్లో రిటైర్ అయిన మురళీధర్ రావు, గణపతి రెడ్డి, రవీందర్ రావులు ఇఎన్సీలుగా ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతున్నట్లు బయటపడింది.

అసెంబ్లీ సెక్రటరీగా మూడేళ్ళ క్రితమే రిటైర్ అయిన నరసింహాచార్యులు కూడా ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎంసీహెచ్ఆర్డీ, సంక్షేమ, మున్సిపల్ శాఖల్లో కూడా చాలామంది ఉన్నతాధికారులు ఇదే పద్దతిలో రీ అపాయిట్మెంట్ తో కంటిన్యు అవుతున్నారట. వీళ్ళ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇలాంటి రీ అపాయిట్మెంట్ అరాచకాలు ఎన్ని శాఖల్లో జరిగాయో ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. కేసీయార్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల వీళ్ళ తర్వాత అధికారులు ప్రమోషన్లు అందుకోకుండానే రిటైర్ అయిపోయారట.

This post was last modified on January 17, 2024 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సిందూర్’లో ఏం జరిగిందంటే..?

జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…

16 minutes ago

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ‘సిందూర్’ మద్దతు

ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…

37 minutes ago

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…

1 hour ago

వీరమల్లుకున్న ఇరకాటం అదొక్కటే

షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…

2 hours ago

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…

3 hours ago

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…

4 hours ago