Political News

కాళేశ్వరంలో అవినీతి ఎంత? మరిన్ని రహస్యాలు బహిర్గతం

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా ఇపుడు బయటపడుతోందని వార్తలు వస్తున్నాయి. కేసీయార్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన కుటుంబసభ్యులు ఆదాయవనరుగా చేసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పటినుండో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. చాలాకాలంగా ఇవన్నీ ఆరోపణలుగానే వినబడుతున్నాయి. అయితే తాజా డెవలప్మెంట్లో ప్రాజెక్టులో జరిగిన అవినీతి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో బయటపడిందని సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా లాభపడింది కాంట్రాక్టు సంస్ధలు మాత్రమే అన్న విషయం కాగ్ రిపోర్టులో వెలుగుచూసింది. ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసిందే కాంట్రాక్టర్ల కోసమని,  చేసిన పేమెంట్లలో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో కాగ్ రిపోర్టులో బయటపడిందని కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. కాళేశ్వరంకు బిగించిన భారీ మోటార్ల కొనుగోలు, బిగింపుల్లో కూడా అవినీతి భారీగానే జరిగిందట. మోటార్ల వాస్తవ ధరకన్నా 327 శాతం ఎక్కవ ధరలను చెల్లించినట్లు కాగ్ గుర్తించింది. మార్కెట్ తో సంబంధంలేకుండా ధరలను కేసీయార్ ప్రభుత్వం ఫిక్స్ చేసినట్లు కాగ్ చెప్పిందట.

ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రు. 60 లక్షలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం తర్వాత రు. 2.57 కోట్లు చెల్లించినట్లు బయటపడింది. 17 ప్యాకేజీల్లో అయిన ఖర్చుల వివరాలను కాగ్ కు కేసీయార్ ప్రభుత్వం ఇవ్వనేలేదట. కాబట్టి ఆ ప్యాకేజీల్లో అయిన ఖర్చులు, చెల్లింపులు, ఏమైనా అవినీతి జరిగుంటే ఆ వివరాలు తెలీదని కాగ్ తన రిపోర్టులో చెప్పిందని తెలిసింది.  

అసలు ప్రాజెక్టు అంచనా వ్యయమే రు.63,852 కోట్లుగా కేసీయార్ ప్రభుత్వం తేల్చింది. అయితే కొంతకాలానికి సవరించిన అంచనాల పేరుతో ఈ మొత్తాన్ని రు. 81,911 కోట్లకు పెంచింది. వివిధ కార్పొరేషన్ల నుండి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అప్పు రు. 87,449 కోట్లు. 2022 మార్చికే ప్రభుత్వం చేసిన ఖర్చు రు. 86, 788 కోట్లు. మొత్తం 18.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సుండగా ఇచ్చింది కేవలం 40,288 ఎకరాలు మాత్రమే. అంటే ప్రాజెక్టు ముసుగులో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతోందని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మరి కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి.

This post was last modified on January 17, 2024 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

1 hour ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

4 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

6 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

8 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

11 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

11 hours ago