ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తనయ వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. దరిమిలా.. ఇప్పుడు ఆమె సుదీర్ఘ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆశ యాలను, లక్ష్యాలను సాధించేందుకు తనవంతు నిరంతరం కృషి చేస్తానని దానిలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని కూడా షర్మిల చెప్పారు. అయితే.. ఇంత గా కాంగ్రెస్ పెట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే.. ఆమె చాలానే కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు.
ముందుగా.. షర్మిల రాజకీయంగా కుదురుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో పెద్దగా లేదు. పైగా ఓటు బ్యాంకు 1శాతం కూడా లేదు. మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాధ్యతలు తీసుకోవడం అంటే.. కత్తిమీద సాములాంటిదే. ఇంకో మాట చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ చిందర వందరగా ఉంది. పార్టీలో ఉన్నా.. నాయకులు యాక్టివ్గా లేరనేది వాస్తవం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని ప్రజలు ఆదరిస్తారో లేదో అనే బెంగ నాయకులను వెంటాడుతోంది.
వైఎస్ అభిమానులుగా ఉన్న నాయకులు కొందరు ఉన్నప్పటికీ.. వారు కూడా సుప్తచేతనావస్థలో ఉన్నారు. పార్టీలో వారు కీలకంగా మారాలంటే.. షర్మిలపై నమ్మకం ఏర్పడడంతోపాటు.. షర్మిల తీరు కూడా వారికి నచ్చాల్సి ఉంటుంది. వైఎస్ లాంటి ఇమేజ్ను ఆమె క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తన తండ్రి మాదిరిగా.. అందరికీ అవకాశాలు కల్పించడంతోపాటు.. అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఇలాచేయడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదనే భావన ఉంది.
ఇంకోవైపు.. ఇప్పటికే వైఎస్ ఇమేజ్ను, ఆయన పాలన తాలూకు ఫ్లేవర్ను ఆయన తనయుడు, వైసీపీ అధినేత, సీఎం జగన్వాడుకుంటున్నారు. వైఎస్ వారసుడిగా.. ప్రజలు ఆయనను గుర్తించారనేది వాస్తవం. ఇదే 2019లో ఆయనకు కలిసి వచ్చింది. కాబట్టి.. ఇప్పుడు వైఎస్ తనయగా.. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుంటున్న షర్మిల.. ఏమేరకు తండ్రి తాలూకు ఇమేజ్ను సొంతం చేసుకుంటారు? ఆయన తాలూకు మనుషులుగా ఉన్న వారిని ఆకట్టుకుంటారనేది చూడాలి. ముందు ఇది సక్సెస్ అయితే.. తర్వాత.. ఎన్నికల పరంగా ఆమె కొంత దూకుడు చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో వైసీపీని నిలువరించేలా ఆమె ఎలా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది.
This post was last modified on January 16, 2024 9:39 pm
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…
ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…
ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…
సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…