Political News

కాంగ్రెస్ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్‌.. వైఎస్ కుటుంబానికి పెద్ద‌పీట‌!

132 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ హిస్ట‌రీలో మునుపు ఎన్న‌డూ జ‌ర‌గ‌ని నిర్ణ‌యం తాజాగా జ‌రిగింది. ఏపీలో కాంగ్రెస్ ప‌గ్గాల‌ను.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డికి అప్ప‌గిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. వెంట‌నే ఈ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని.. త‌మ ఆదేశాలు కూడా త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని .. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇలా.. ఒక దివంగ‌త నాయ‌కుడి కుమార్తెకు ఏకంగా పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్ పాల‌నా కాలంలో ఆయ‌న పీసీసీ ప‌గ్గాలు తీసుకున్నారు. త‌ర్వాత ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో నే ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటూ.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుమారుడు విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి యువ నాయ‌కుడిగా పార్టీలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఆ త‌ర్వాత‌.. పొన్నాల లక్ష్మ‌య్య‌.. పార్టీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆయ‌నకు వార‌సులు లేరు. ఇక‌, జానా రెడ్డి కూడా పీసీసీ చీఫ్‌గా చేసినా.. ఆయన త‌ర్వాత‌.. ఆయ‌న కుటుంబంలోని వారికి ఇవ్వాల‌ని పార్టీని కోరినా.. కాంగ్రెస్ ఇవ్వ‌లేదు. ఒక్క ఏపీలోనే కాదు.. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా.. పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ముర‌ళీ దేవ్‌రా.. సుదీర్ఘ‌కాలం 15 సంవ‌త్స‌రాలు ఉన్నారు. ఆయ‌న వార‌సుడు ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేసిన మిలింద్ దేవరాకు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని ముర‌ళీ కోరారు. అయితే.. ఆయ‌న‌ను ముంబై కాంగ్రెస్ శాఖ బాధ్య‌త‌లు మాత్ర‌మే అప్ప‌గించారు.

ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ అనేక మంది నాయ‌కులు ప‌నిచేసినా.. వారి వార‌సుల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. ఏపీలో అది కూడా విభ‌జ‌న త‌ర్వాత‌.. సుదీర్ఘ కాలానికి దివంగ‌త వైఎస్ కుటుంబానికి చెందిన ఆయ‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం కాంగ్రెస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది రాజ‌కీయంగా వైఎస్ కుమారుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెక్ పెట్టే వ్యూహంతో వేసిన అడుగుగానే భావిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల ఏమేర‌కు కాంగ్రెస్ ల‌క్ష్యాన్ని సాధిస్తారో చూడాలి.

Satya

Recent Posts

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

34 minutes ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

2 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

3 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

3 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

5 hours ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

6 hours ago