Political News

కాంగ్రెస్ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్‌.. వైఎస్ కుటుంబానికి పెద్ద‌పీట‌!

132 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ హిస్ట‌రీలో మునుపు ఎన్న‌డూ జ‌ర‌గ‌ని నిర్ణ‌యం తాజాగా జ‌రిగింది. ఏపీలో కాంగ్రెస్ ప‌గ్గాల‌ను.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డికి అప్ప‌గిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. వెంట‌నే ఈ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని.. త‌మ ఆదేశాలు కూడా త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని .. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇలా.. ఒక దివంగ‌త నాయ‌కుడి కుమార్తెకు ఏకంగా పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్ పాల‌నా కాలంలో ఆయ‌న పీసీసీ ప‌గ్గాలు తీసుకున్నారు. త‌ర్వాత ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో నే ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటూ.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుమారుడు విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి యువ నాయ‌కుడిగా పార్టీలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఆ త‌ర్వాత‌.. పొన్నాల లక్ష్మ‌య్య‌.. పార్టీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆయ‌నకు వార‌సులు లేరు. ఇక‌, జానా రెడ్డి కూడా పీసీసీ చీఫ్‌గా చేసినా.. ఆయన త‌ర్వాత‌.. ఆయ‌న కుటుంబంలోని వారికి ఇవ్వాల‌ని పార్టీని కోరినా.. కాంగ్రెస్ ఇవ్వ‌లేదు. ఒక్క ఏపీలోనే కాదు.. ఇత‌ర రాష్ట్రాల్లో కూడా.. పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ముర‌ళీ దేవ్‌రా.. సుదీర్ఘ‌కాలం 15 సంవ‌త్స‌రాలు ఉన్నారు. ఆయ‌న వార‌సుడు ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేసిన మిలింద్ దేవరాకు పీసీసీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని ముర‌ళీ కోరారు. అయితే.. ఆయ‌న‌ను ముంబై కాంగ్రెస్ శాఖ బాధ్య‌త‌లు మాత్ర‌మే అప్ప‌గించారు.

ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ అనేక మంది నాయ‌కులు ప‌నిచేసినా.. వారి వార‌సుల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌లేదు. ఏపీలో అది కూడా విభ‌జ‌న త‌ర్వాత‌.. సుదీర్ఘ కాలానికి దివంగ‌త వైఎస్ కుటుంబానికి చెందిన ఆయ‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం కాంగ్రెస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది రాజ‌కీయంగా వైఎస్ కుమారుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెక్ పెట్టే వ్యూహంతో వేసిన అడుగుగానే భావిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల ఏమేర‌కు కాంగ్రెస్ ల‌క్ష్యాన్ని సాధిస్తారో చూడాలి.

This post was last modified on January 16, 2024 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

36 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

54 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago