132 సంవత్సరాల కాంగ్రెస్ హిస్టరీలో మునుపు ఎన్నడూ జరగని నిర్ణయం తాజాగా జరిగింది. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలను.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పగిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ బాధ్యతలు తీసుకోవాలని.. తమ ఆదేశాలు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని .. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇలా.. ఒక దివంగత నాయకుడి కుమార్తెకు ఏకంగా పీసీసీ పగ్గాలు అప్పగించడం.. ఇప్పటి వరకు జరగలేదు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ పాలనా కాలంలో ఆయన పీసీసీ పగ్గాలు తీసుకున్నారు. తర్వాత పబ్బతి రెడ్డి జనార్దన్రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో నే ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ.. హఠాన్మరణం చెందారు. ఆ సమయంలో ఆయన కుమారుడు విష్ణు వర్ధన్రెడ్డి యువ నాయకుడిగా పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ.. పార్టీ ధర్మపురి శ్రీనివాస్కు పగ్గాలు అప్పగించింది.
ఆ తర్వాత.. పొన్నాల లక్ష్మయ్య.. పార్టీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆయనకు వారసులు లేరు. ఇక, జానా రెడ్డి కూడా పీసీసీ చీఫ్గా చేసినా.. ఆయన తర్వాత.. ఆయన కుటుంబంలోని వారికి ఇవ్వాలని పార్టీని కోరినా.. కాంగ్రెస్ ఇవ్వలేదు. ఒక్క ఏపీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా.. పార్టీ పగ్గాలు అప్పగించలేదు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్గా మురళీ దేవ్రా.. సుదీర్ఘకాలం 15 సంవత్సరాలు ఉన్నారు. ఆయన వారసుడు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన మిలింద్ దేవరాకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని మురళీ కోరారు. అయితే.. ఆయనను ముంబై కాంగ్రెస్ శాఖ బాధ్యతలు మాత్రమే అప్పగించారు.
ఇక, కర్ణాటకలోనూ అనేక మంది నాయకులు పనిచేసినా.. వారి వారసులకు పీసీసీ పగ్గాలు అప్పగించలేదు. ఏపీలో అది కూడా విభజన తర్వాత.. సుదీర్ఘ కాలానికి దివంగత వైఎస్ కుటుంబానికి చెందిన ఆయన కుమార్తె వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారి అని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇది రాజకీయంగా వైఎస్ కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కు చెక్ పెట్టే వ్యూహంతో వేసిన అడుగుగానే భావిస్తున్నారు. మరి షర్మిల ఏమేరకు కాంగ్రెస్ లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి.
This post was last modified on January 16, 2024 9:25 pm
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…